RK Roja: బుల్లితెరపైకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన రోజా.. ప్రోమో అదుర్స్!

రోజా సెల్వమణి బుల్లితెరపై మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్‌ షిప్ సీజన్‌ 4లోకి రోజా జడ్జిగా వ్యవహరించనుంది. ఈ షోకి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. రోజా ఇందులో సందడి చేసింది.

New Update

రోజా సెల్వామణి..  ఈపేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా చెలామణీ అయిన రోజా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, పలు షోలకు జడ్జిలగా నిర్వహించేది. అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వ సమయంలో రోజా నగిరి నియోజకవర్గం నుంచి ఎమ్యెల్యేగా గెలుపొందింది. దీంతో జగన్ ప్రభుత్వం రోజాకు ఏపీ మినిస్టర్ టూరిజం పదవిని కూడా ఇచ్చారు.

ఇది కూడా చూడండి: AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే!

సినిమాలు, షోలు చేయనని చెప్పి..

మంత్రి పదవి చేపట్టిన తర్వాత రోజా పలు టీవీ షోలకు గుడ్ బై చెప్పింది. ఈ సమయంలో రోజా పాపులర్ షో జబర్దస్త్‌లో జడ్జిగా వ్యవహరించేది. అయితే బాధ్యత గల మంత్రి పదవిలో ఉండటంతో జబర్దస్త్ షోకి వీడ్కోలు పలకడంతో పాటు ఇకపై షోలు, సినిమాలు చేయనని తెలిపింది. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది.

ఇది కూడా చూడండి: Kishan reddy: సీఎం రేవంత్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

నగిరి నియోజక వర్గం నుంచి రోజా కూడా ఓటమిని చూసింది. అయితే తాజాగా రోజా మళ్లీ బుల్లి తెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్‌ షిప్ సీజన్‌ 4లోకి రోజా రీ ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. రోజా ఇందులో దర్శనమిచ్చింది. ఈ ప్రోమోలో శ్రీకాంత్, రాశి కూడా ఉన్నారు.

వీరు ముగ్గురు కూడా ఈ షోకి జడ్జిలుగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి 2వ తేదీన ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ షో మొదలు కానుంది. ఈ షోకి రవి, అషురెడ్డి యాంకర్స్‌గా వ్యవహరిస్తున్నారు. బుల్లి తెరపై రోజా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Allu Arjun: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!

#show #judge #program #roja-selvamani #Zee Telugu
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Raja Saab Update: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కను...

Raja Saab Update: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్‌డేట్ ఆన్‌ ది వే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న "ది రాజా సాబ్" నుంచి మే మద్యలో భారీ అప్‌డేట్ రాబోతోందని దర్శకుడు హింట్ ఇచ్చారు. నిర్మాణం ఆలస్యమవడంతో 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకున్న ఈ మూవీ వాయిదా పడింది.

New Update
Maruthi Raja Saab Tweet

Maruthi Raja Saab Tweet

Raja Saab Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మలవిక మోహనన్(Malavika Mohanan) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ  రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్‌ "ది రాజా సాబ్"మూవీ నుండి అప్‌డేట్ రాబోతుందని డైరెక్టర్ మారుతి(Director Maruthi) సోషల్ మీడియా 'X' ద్వారా హింట్ ఇచ్చారు.  

Also Read: లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి

HIGH ALERT…!!

చాలా రోజులుగా అభిమానులు ఈ సినిమాపై కొత్త అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి వారి కోరిక నెరవేరినట్టు కనిపిస్తోంది. దర్శకుడు మారుతి తన 'X' (ట్విట్టర్) ఖాతాలో ఓ ఆటోపై ప్రభాస్ స్టిల్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, “HIGH ALERT…!! HEAT WAVES gonna rise even higher from mid-May!” అంటూ క్యాప్షన్ పెట్టారు.

Maruthi Raja Saab Tweet
Maruthi Raja Saab Tweet

 

Also Read: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఈ పోస్ట్‌తో మే మద్యలో భారీ అప్‌డేట్ రానుందని స్పష్టమవుతోంది. ఇది టీజర్‌కు సంబంధించినదా? లేక విడుదల తేదీకి సంబంధించినదా? అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

అసలు "ది రాజా సాబ్"ను మొదట 2025 ఏప్రిల్ 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ, నిర్మాణంలో జాప్యం కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్ మరో కథానాయికగా కనిపించనున్నారు.

ఈ భారీ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందిస్తున్నారు.

 

 

Advertisment
Advertisment
Advertisment