BREAKING: ఆర్జీవీ సంచలన నిర్ణయం!

ఏపీ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు ఆర్జీవీ. తాను ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టుపై చట్టవిరుద్ధంగా అనేక కేసులు పెడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా పోలీసులకు ఆదేశించాలని కోరారు. ఈరోజు ఈ పిటిషన్‌ను కోర్టు విచారించనుంది.

New Update
RGV

RGV: వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన మరోసారి ఏపీ హైకోర్టును  ఆశ్రయించారు. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు. చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. ఇప్పటివరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని ఆర్జీవీ పిటిషన్నే వేయగా.. నేడు ఆ పిటిషన్‌ హైకోర్టులో విచారణకు రానుంది.

ఇది కూడా చదవండి: తెలంగాణ రైతులకు ఓ గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్

ఆర్జీవీ టార్గెట్ గా కేసులు...

గత వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా టీడీపీని, ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టారు. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రివెంజ్ ప్లాన్ చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఆర్జీవీ పై వివిధ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్జీవీపై మొత్తం తొమ్మిది కేసులు నమోదు అయినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!

ఈ క్రమంలో పోలీసులు ఆర్జీవీ అరెస్ట్ చేస్తారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. ఆర్జీవీ పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుల నుంచి తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వరుస వాయిదాలు పడుతున్నాయి. దీంతో ఆర్జీవీ ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరి ఆర్జీవీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందా? లేదా?.. ఒకవేళ ముందస్తు బెయిల్ రాకపోతే ఆర్జీవీ అరెస్ట్ తప్పదా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. 

ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రి పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు!

ఇది కూడా చదవండి: సర్కార్ స్కూళ్లలో స్పోకెన్ ఇంగ్లీష్.. అక్కడి నుంచే స్టార్ట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment