Peddi: 'పెద్ది'లో ఆ సీన్స్ అన్ని కట్.. రీ ఎడిట్ వెర్షన్ రిలీజ్ ఎప్పుడంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.241 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందం కొన్ని సీన్లను తొలగించి, రామ్ చరణ్-జగపతి బాబు మధ్య కొత్త సన్నివేశాలను జోడించనుంది. కొత్త వెర్షన్‌ను మళ్లీ సెన్సార్ చేసి థియేటర్లలో విడుదల చేయనున్నారు.

New Update
Peddi

Peddi

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటన, సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Peddi Collections

సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.241 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారతదేశంలో ఈ చిత్రం ఇప్పటికే రూ.201 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటగా, విదేశీ మార్కెట్లలో సుమారు రూ.40 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.

సోమవారం రోజున కూడా సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. వారాంతం తర్వాత కలెక్షన్లు తగ్గడం సాధారణమే అయినప్పటికీ, ‘పెద్ది’ భారత్‌లో దాదాపు రూ.14 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. అలాగే అదే రోజు బుక్‌మైషోలో సుమారు 1.74 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

అయితే సినిమా విడుదలైన తర్వాత కొన్ని అంశాలపై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు, అలాగే సెకండాఫ్‌లో కొన్ని పాత్రల ముగింపు సంతృప్తికరంగా లేదని సోషల్ మీడియాలో చర్చ జరిగింది.

ఈ నేపథ్యంలో ప్రేక్షకుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకున్న చిత్ర బృందం సినిమాలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తాజా వార్తల ప్రకారం, సినిమా నిడివిని తగ్గించడంతో పాటు కొన్ని సన్నివేశాలను తొలగించి, మరికొన్ని కొత్త సన్నివేశాలను జోడించనున్నారు.

ప్రత్యేకంగా సెకండాఫ్‌లో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ పోషించిన ‘గౌర్ నాయుడి’ పాత్రకు సంబంధించిన కొన్ని ఫ్లాష్‌బ్యాక్ సీన్లను తీసివేయాలని భావిస్తున్నారట. ఆ సన్నివేశాలు సినిమా ఫ్లో తగ్గిస్తున్నాయనే అభిప్రాయం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో అభిమానులకు మరింత ఆసక్తి కలిగించేలా రామ్ చరణ్, జగపతి బాబు మధ్య ఉన్న కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కొత్తగా జోడించనున్నారని సమాచారం. ఈ మార్పులు పూర్తయిన తర్వాత కొత్త వెర్షన్‌ను మళ్లీ సెన్సార్‌కు పంపి, ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శిస్తున్న వెర్షన్ స్థానంలో అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రాంతాల వారీగా చూస్తే, ఆంధ్రప్రదేశ్‌లో ‘పెద్ది’ అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. అయితే తెలంగాణలో కలెక్షన్లు అంచనాలకు కొంత తక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే హిందీ వెర్షన్ పెద్ద స్థాయి ప్రభావం చూపలేకపోయింది.

అయినా కూడా ప్రధాన మార్కెట్లలో ప్రేక్షకుల ఆదరణ కొనసాగుతుండటంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బలంగా కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే జోరు కొనసాగితే ‘పెద్ది’ మరింత భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా, వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివరాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు.

Advertisment
తాజా కథనాలు