Fight Obesity: రజినీకాంత్, చిరు, మమ్ముట్టిని నామినేట్ చేసిన మోహన్ లాల్.. ఎందుకంటే?

'మన్‌ కీ బాత్‌' కార్యక్రమంలో మోదీ ఊబకాయంపై పోరులో తన పేరును నామినేట్ చేయడం పై నటుడు మోహన్ లాల్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హెల్తీ ఇండియాను నిర్మిద్దాం అంటూ తాను కూడా మరో పది మందిని నామినేట్ చేశారు. చిరు, రజినీ, మమ్ముట్టి తదితరులను నామినేట్ చేశారు.

New Update
fight obesity

fight obesity mankibaat

Mohanlal: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం జరిగిన  'మన్‌ కీ బాత్‌' కార్యక్రమంలో  దేశంలో ఒబెసిటీ సమస్యను అధికమించేందుకు పిలుపునిచ్చారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పది మంది ప్రముఖులను నామినేట్ చేశారు. అందులో స్టార్ హీరో మోహన్ లాల్ పేరు కూడా ఉంది. అయితే నటుడు మోహన్ లాల్ దీని పై స్పందిస్తూ.. తనను నామినేట్ చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

మరో పది మందిని 

హెల్తీ ఇండియాను నిర్మిద్దాం అంటూ తాను కూడా మరో పది మంది సినీ ప్రముఖులను నామినేట్ చేశారు. ''ఒబేసిటీపై పోరాట ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నందుకు ప్రధానికి ధన్యవాదాలు. నూనె వాడకాన్ని తగ్గించడం వల్ల మార్పు రావచ్చు. ఈ మిషన్ లో చేతులు కలిపేందుకు నేను కూడా పది మందిని నామినేట్ చేస్తున్నాను. కలసికట్టుగా ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మిద్దాం'' అంటూ మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి, టోవినో థామస్, ఉన్నిముకుందన్, మంజూవారియర్, కళ్యాణి ప్రియదర్శని తదితరులను నామినేట్ చేశారు. 

Also Read: Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి ఆలు అల్లు అరవింద్‌ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా

 

మంకీబాత్ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. 2022 ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నట్లు తెలిపారు.  ప్రతీ ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కుంటున్నారని. ఇది చాలా ఆందోళకరమైన విషయమని అన్నారు. దీనిని అధిగమించేందుకు మనమంతా కృషి చేయాలి. తినే ఆహారంలో వంటనూనె వాడకాన్ని కనీసం పది శాతం వరకు తగ్గించాలి అంటూ #fight obesity ki పిలుపునిచ్చారు. 

 Also Read: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

Advertisment
Advertisment
Advertisment