అర్జున్ S/O వైజయంతి.. 25 ఏళ్ల తరువాత మళ్లీ..!

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న #NKR21 నుంచి టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు అర్జున్ S/O వైజయంతి అనే టైటిల్ తో పాటుగా పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ ను కూడా రిలీజ్ చేశారు.

New Update
 #NKR21

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతోన్న #NKR21 నుంచి టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు అర్జున్ S/O వైజయంతి అనే టైటిల్ తో పాటుగా పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ ను కూడా రిలీజ్ చేశారు.  టైటిల్ లో S/O  అనే దాన్ని సంకెళ్లతో చూపిస్తూ వారి బాండింగ్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఇందులో విజయశాంతి  పోలీస్ ఆఫీసర్ లుక్ లో కనిపిస్తుండగా.. కళ్యాణ్ రామ్ ఆమెకు కొడుుకుగా కనిపించనున్నారు. 

Also read :  గురుమూర్తి కేసులో బిగ్ ట్విస్ట్.. DNA టెస్టులో బయటపడిన సంచలనాలు!

Also read :  ఏపీలో మరో కొత్త జిల్లా.. చంద్రబాబు కీలక ప్రకటన!

25 ఏళ్ల తరువాత

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.  కాగా 1990లో విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమాలో కూడా ఆమెది వైజయంతి పాత్ర కాగా..   మళ్లీ 25 ఏళ్ల తరువాత ఆమె అదే పాత్రలో కనిపించబోతున్నారు.  ఇందులో కళ్యాణ్ రామ్ కు జోడీగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా..   సోహైల్ ఖాన్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. తమ్మిరాజు ఎడిటర్. స్క్రీన్‌ప్లేను శ్రీకాంత్ విస్సా రాశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను  ప్రకటించనున్నారు.

Also Read :  మగాళ్లను మర్డర్ చేసే అవకాశం ఇవ్వండి.. రాష్ట్రపతికి మహిళా నేత సంచలన లేఖ!

Also read :  పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment