Viswam: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'విశ్వం'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

గోపీచంద్ లేటెస్ట్ మూవీ 'విశ్వం' ఓటీటీలోకి రాబోతుంది. దీపావళి కానుకగా నవంబర్‌ 1న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్టీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుండడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కే ఛాన్స్ ఉంది.

New Update
viswam

ఈ దసరాకు మంచి అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ అయింది 'విశ్వం' సినిమా. గోపీచంద్ హీరోగా నటించిన ఈ మూవీకి శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. శ్రీనువైట్ల లాంగ్ గ్యాప్ తర్వాత తీసిన సినిమా కావడంతో ఈ చిత్రంపై ఆడియన్స్ లో భారీ హైప్ నెలకొంది. అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. 

కామెడీ కొంతవరకు వర్కౌట్ అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేక పోవడంతో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. ఇక ఈ దీపావళికి లక్కీ భాస్కర్, క, అమరన్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. కొత్త సినిమాల రాకతో గత చిత్రాలను థియేటర్స్ నుంచి తొలగిస్తారు. ఆ లిస్టులో మొదట 'విశ్వం' సినిమానే ఉంది. ఈ క్రమంలోనే ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌లో ఉన్నారట. 

Also Read :  ఇంట్లో కుమారుడి డెడ్‌బాడీ.. చూపు లేని ఈ తల్లిదండ్రుల బాధ చూస్తే కన్నీళ్లు ఆగవు!

Also Read : 'SSMB29' పనులు మొదలెట్టిన రాజమౌళి.. ఫోటో షేర్ చేస్తూ

20 రోజుల్లోనే ఓటీటీకి..

అనుకున్న డేట్ కంటే కాస్త త్వరగా ఓటీటీలో విడుదల చేస్తే కొంతైనా సేఫ్‌ కావచ్చని మేకర్స్‌ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా నవంబర్‌ 1న 'విశ్వం' సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయునున్నట్లు  తెలుస్తోంది. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుండడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కే ఛాన్స్ ఉంది. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Also Read :  ఇజ్రాయెల్ కొత్త స్కెచ్.. ఇదే జరిగితే యుద్ధం తప్పదా?

యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించారు. కావ్యా థాపర్ కథానాయికగా నటించగా.. సీనియర్ నటుడు నరేశ్, ప్రగతి, వెన్నెల కిశోర్‌ తోపాటు షకలక శంకర్‌, అజయ్ ఘోష్‌ ఇతర పాత్రల్లో కనిపించారు.

Also Read :  మరోసారి ఆ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HBD Allu Arjun: బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ సాధించిన 8 అరుదైన రికార్డులు ఇవే

ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా బన్నీ తన కెరియర్‌లో సాధించిన రేర్ రికార్డులు ఉన్నాయి. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో ఇతడే. అలాగే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కైవసం చేసుకున్న తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందాడు.

New Update
allu arjun.

allu arjun

ఇవాళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా బన్నీకి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు, ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అరుదైన రికార్డులు సాధించిన టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. అందువల్ల అల్లు అర్జున్ ఇప్పటి వరకు తన కెరీర్‌లో సాధించిన అరుదైన రికార్డులు తెలుసుకుందాం. 

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

Allu Arjun Rare Records

అల్లు అర్జున్ తెలుగు చిత్ర సీమలో ఏ దిగ్గజ నటుడికి దక్కని అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. 2023లో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సాధించాడు. ఈ అవార్డు అందుకున్న మొదటి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప: ది రైజ్‌లో తన పాత్రకు ఈ అవార్డు వరించింది. 

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. దీంతో దేశంలోనే రెండో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో బన్నీ ‘పుష్ప2’ రికార్డు క్రియేట్ చేసింది. ఇది దాదాపు రూ.1831 కోట్ల వసూళ్లు రాబట్టింది. 

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

అల్లు అర్జున్ ఖాతాలో మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు ఉంది. అదే "ఇండియన్ ఆఫ్ ది ఇయర్" అవార్డు. దీనిని బన్నీ 2022లో దక్కించుకున్నాడు. ఈ అవార్డు ఎంటర్‌టైన్మెంట్ కేటగిరీలో లభించింది. దీంతో ఈ అవార్డును సొంతం చేసుకున్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ గుర్తింపు పొందాడు. 

అల్లు అర్జున్ ‘పుష్ప2’ కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలిసింది. అతడు 2024లో అత్యధిక పారితోషికం దాదాపు రూ.300 కోట్లు తీసుకున్న భారతీయ నటుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. 

అల్లు అర్జున్ ఇటీవల 2024లో 74వ బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్నాడు. అక్కడ బన్నీ భారతీయ సినిమా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

 అల్లు అర్జున్ తన కెరీర్‌లో అతి ముఖ్యమైన మైలురాయిని నెలకోల్పాడు. అల్లు అర్జున్ మైనపు విగ్రహం దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు. దీంతో దక్షిణ భారతదేశం నుండి ఈ గౌరవం అందుకున్న తొలి నటుడిగా బన్నీ రికార్డు క్రియేట్ చేశాడు. 

అల్లు అర్జున్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 28 మిలియన్లకు పైగా  ఫాలోవర్స్ ఉన్న సౌత్ యాక్టర్‌గా రికార్డు సృష్టించాడు. 

Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

బన్నీ కెరీర్‌లో అందరికీ గుర్తుండిపోయే చిత్రం దేశముదురు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్‌ ప్యాక్‌తో అదరగొట్టేశాడు. దీంతో సిక్స్ ప్యాక్ చేసిన ఫస్ట్ టాలీవుడ్ హీరోగా ఐకాన్‌ స్టార్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 

(telugu-news | latest-telugu-news | hbd-allu-arjun | allu-arjun | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | breaking news telugu)

Advertisment
Advertisment
Advertisment