Veera Dheera Soora trailer: విక్రమ్ యాక్షన్ మూవీ వీర ధీర శూర.. ట్రైలర్ మస్త్ ఉందిగా!

విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్‌ మూవీ వీర ధీర శూర ట్రైలర్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. ఈ సినిమాలో దుషారా విజయన్‌, ఎస్‌.జె. సూర్య (SJ Suryah) కీలక పాత్రలు పోషించారు. ఎస్‌.యు.అరుణ్‌ కుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ మార్చి 27న రిలీజ్ కానుంది.

New Update

విక్రమ్‌ (Chiyaan Vikram) హీరోగా తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్‌ సినిమా ‘వీర ధీర శూర’ (Veera Dheera Sooran). ఈ సినిమాలో దుషారా విజయన్‌ (Dushara Vijayan), ఎస్‌.జె. సూర్య (SJ Suryah) కీలక పాత్రలు పోషించారు. ఎస్‌.యు.అరుణ్‌ కుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ మార్చి 27న ప్రేక్షకులు ముందుకు వస్తుంది. ఈ క్రమంలో మూవీ టీం ఇటీవల ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. యాక్షన్ సీన్స్‌తో అయితే ట్రైలర్ అదిరిపోయింది. యాక్షన్ సీన్లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్ని కూడా సూపర్ ఉన్నాయి. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా ఉంది. ముందుగా పార్ట్ 2ను విడుదల చేసి.. ప్రీక్వెల్‌గా పార్ట్ 1ను తర్వలో విడుదలు చేయనున్నారు.  

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

ఇది కూడా చూడండి: Betting App Case: ఎవ్వరినీ వదలకండి.. అందరిని జైల్లో వేయండి- పోలీసులకు మైనంపల్లి ఫిర్యాదు!

ఇది కూడా చూడండి: నీ మొగుడ్ని వదిలేసి రా.. హైదరాబాద్ మహిళకు ఎన్ఆర్ఐ వేధింపులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment