RGVకి షాకిచ్చిన ఏపీ హైకోర్టు..

ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురైంది. RGV దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. దీంతో ఆర్జీవీ పిటిషన్‌పై నవంబర్‌ 27న హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు ఆర్జీవీ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

New Update
RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఆర్జీవీకి కోర్టులో చుక్కెదురు అయింది. ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగగా.. రేపటికి వాయిదా వేసింది. దీంతో నవంబర్ 27న ఆర్జీవీ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.

Also Read: ఫుట్‌పాత్‌ పైకి దూసుకెళ్లిన లారీ..ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు

ఆర్జీవీ కోసం పోలీసులు గాలింపు

ఇదిలా ఉంటే మరోవైపు ఆర్జీవీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. రెండు బృందాలుగా ఏపీ పోలీసులు ముమ్మరంగా సెర్చింగ్ చేస్తున్నారు. దాదాపు రెండు రోజులు కావస్తున్నా.. ఆర్జీవీ ఎక్కడా కనిపించకపోవడం లేదు. దీంతో ఆయన తెలుగు స్టేట్స్ లోనే ఉన్నాడా? లేక మరెక్కడికైనా వెళ్లిపోయాడా? అసలు ఎక్కడున్నాడు? అని కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు.

Also Read: ఫ్యాన్స్ కు లైవ్ లో నాగచైతన్య పెళ్లి చూసే అవకాశం.. ఎలాగో తెలుసా..!

కేసు ఏంటి?

వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా బ్రాహ్మణి ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడని.. అలాగే ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ టైంలో వారిపై అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేశాడని.. టీడీపీ నేత రామలింగం మద్ధిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11న మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో RGV పై PS 7 సెక్షన్ ల క్రింద కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఇటీవల విచారణకు రావాలని RGV కి నోటీసులు కూడా అందించారు.

Also Read: పాకిస్థాన్‌లో ఉద్రిక్తత.. కనిపిస్తే కాల్చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు

తొలుత ఈ కేసులో కీలక అంశాలపై విచారించేందుకు విచారణకు నవంబర్ 11న రావాలని ఒంగోలు రూరల్ పోలీసులు నోటిసులు ఇచ్చారు. ఈ క్రమంలో అర్జీవి విచారణకు డుమ్మా కొట్టారు. ముందస్తు షెడ్యుల్ కారణంగా రాలేనని CI కి వాట్సాప్ ద్వారా.. తన తరపున అడ్వకేట్ ద్వారా తెలియజేశారు. తనకు వారం రోజుల సమయం కావాలని కోరారు. అయితే RGV విన్నపం మేరకు పోలీసులు ఈ నెల 25న అంటే నిన్న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.

Also Read: పవన్ ఇక పాన్ ఇండియా పొలిటీషియన్.. బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం!

కానీ నిన్న కూడా విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు ఆర్జీవి ఇంటికి నేరుగా వెళ్లారు. కానీ అక్కడ ఆయన లేరు. దీంతో ఆర్జీవి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Manchu Lakshmi - Manoj: అక్కా ఏడవకే.. మనోజ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి - VIDEO

ఫ్యామిలీ వివాదాలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్‌ని ఓ ఫంక్షన్లో చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. ఆమె స్టేజ్‌పై ఉన్న సమయంలో మనోజ్ దంపతులు వెళ్లారు. వారిని చూడగానే లక్ష్మి కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయింది. పక్కనే ఉన్న మౌనిక అక్కా తమ్ముళ్ళను ఓదార్చింది.

New Update
manchu lakshmi gets emotional over seeing manchu manoj

manchu lakshmi gets emotional over seeing manchu manoj

అక్కా తమ్ముళ్ల బంధం ఎన్నటికీ వీడనిది.. విడదీయలేనిది. ఎన్ని గొడవలు జరిగినా.. తిరిగి మళ్లీ ఒక్కటి కావాల్సిందే. అదే మరోసారి నిజమైంది. మంచు ఫ్యామిలీలో  గత కొన్నాళ్లుగా వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా మంచు ఫ్యామిలీ గొడవలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నాయి. అక్కడితో ఆగలేదు. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు- మంచు మనోజ్ మరోవైపు. సినిమాను తలపించేలా వీరి వివాదం నడిచింది. ఇప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆ మధ్య వీరు ఒకరినొకరు తిట్టుకుని.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు కాస్త సైలెంట్ అయ్యారు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

కానీ ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో చిచ్చు రాజుకుంది. మంచు మనోజ్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ తన తండ్రి మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే మంచు విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని మనోజ్ ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఇదే రచ్చ కొనసాగుతోంది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

ఇలా వరుస వివాదాలతో మంచు ఫ్యామిలీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఈ వివాదాలపై నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే మంచు లక్ష్మికి తమ్ముడు మనోజ్‌ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు నడుస్తున్నాయి. గతంలో ఆమె ముంబై నుంచి వచ్చి గొడవలను సరిచేయాలని చూసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదని.. అక్కడ నుంచి వెంటనే మళ్లీ ఆమె వెళ్లిపోయిందని వార్తలు వినిపించాయి. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

అక్కా తమ్ముళ్ల అనుబంధం

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి, తమ్ముడు మంచు మనోజ్ కలిసారు. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి ఏర్పాటు చేసింది. అందులో తన కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. అదే సమయంలో మంచు లక్ష్మి స్టేజ్ మీద ఉండగానే.. వెనుక నుంచి మంచు మనోజ్ దంపతులు సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమ్ముడు మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మీ మనసారా హత్తుకుని ఏడ్చేసింది. దీంతో పక్కనే ఉన్న మనోజ్ భర్య ఆమెను ఓదార్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధం విడదీయలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

(manchu-manoj | manchu lakshmi | manchu family | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment