OG Movie: ఇదేం ట్విస్ట్ సామీ..'OG' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అకీరా?

అకీరా ఎంట్రీపై తమన్ క్లారిటీ ఇచ్చాడు. కీబోర్డు ప్లే చేయడంలో అకీరా మాస్టర్. నేను త్వరలోనే 'ఓజీ' మ్యూజికల్ సెషన్స్‌కు అకీరాను పిలుస్తా. తను నాతో రెండు నెలలు పనిచేశాడని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి అకిరా 'ఓజీ' మూవీ కోసం వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
og22

పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి చిన్న వయసులోనే తన మల్టీ టాలెంట్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు. పవన్ వారసుడి మూవీ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొద్ది రోజులుగా 'ఓజీ' మూవీతో అకీరా ఎంట్రీ ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చాడు.

మ్యూజిషియన్‌గా అకీరా ఎంట్రీ..


'ఓజీ' అకీరా ఎంట్రీ నిజమేనని అన్నాడు. కానీ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే.. అకీరా జీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేది యాక్టర్ గా కాదట.. మ్యుజీషియన్ గా.. తమన్ తాజాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశారు. అందులో అకీరా గురించి మాట్లాడుతూ..' కీ బోర్డు ప్లే చేయడంలో అకీరా మాస్టర్. నేను త్వరలోనే 'ఓజీ' మ్యూజికల్ సెషన్స్‌కు అకీరాను పిలుస్తా. అకీరా వేళ్లు చాలా పొడవుగా ఉంటాయి. 

Also Read: మహారాష్ట్రలో పవన్ ప్రచారం..తెలుగు, హిందీ, మహారాష్ట్రల్లో ప్రసంగం

Also Read : కీరవాణి ఇంట పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫొటోలు

అతడు పర్‌ఫెక్ట్‌ పియానిస్ట్‌గా కనిపిస్తాడు. అకీరా నాతో రెండు నెలలు పనిచేశాడు..' అని చెప్పుకొచ్చాడు. తమన్ మాటలను బట్టి చూస్తే 'OG' తో అకిరా మ్యూజిషియన్‌గా ఎంట్రీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. కాగా  'OG' సినిమాకు సాహూ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులలో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రంలో విలన్ రోల్ ప్లే చేస్తుండగా.. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

Also Read : 'పుష్ప 2'.. ట్రైలర్ లోనే సినిమా స్టోరీ మొత్తం చెప్పేశారుగా..!

Also Read : రాజమౌళి - మహేష్ సినిమాకు బిగ్ షాక్.. తప్పుకున్న స్టార్ టెక్నీషియన్?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment