మళ్ళీ త్రివిక్రమ్ మీద మరో బాంబ్.. విరుచుకుపడ్డ పూనమ్ కౌర్ డాన్స్ మాస్టర్ జానీ అసలు రూపం బయటపడిన నేపథ్యంలో నటి పూనమ్ కౌర్ మరోసారి బాంబ్ పేల్చింది. దర్శకుడు త్రివిక్రమ్ మీద మళ్ళీ విరుచుకుపడింది. గతంలోనే తాను ఫిర్యాదు చేశానని..ఇప్పటికైనా అతనిని ప్రశ్నించాలని కోరింది. By Manogna alamuru 17 Sep 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Actress Poonam Kaur: దర్శకుడు త్రివిక్రమ్, నటి పూనం కౌర్ గొడవ చాలా ఏళ్ళుగానే నాగుతోంది. పూనమ్ దర్శకుడి మీద చాలాసార్లు కంప్లైంట్ చేసింది. ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారంతో మరోసారి సంచలన ట్వీట్ చేసింది నటి. దర్శకుడు త్రివిక్రమ్ని ప్రశ్నించాలని...సినీ పరిశ్రమ పెద్దలను కోరుతున్నానంటూ పూనం అందులో రాసింది. గతంలో నేను ఫిర్యాదు చేసినప్పుడు నాకు ఎవ్వరూ సహకరించలేదని చెప్పింది. అంతేకాదు రాజకీయంగా కూడా నేను ఇబ్బందులు ఎదుర్కొన్నా అని చెప్పింది. ఇప్పటికే జానీ మాస్టర్ ఇష్యూతో రచ్చ అయి టాలీవుడ్లో పూనం ట్వీట్తో ప్రకంపనలు వచ్చాయి. పూనమ్ కౌర్ ఎప్పటి నుంచో త్రివిక్రమ్, పవన్ కల్యాణ్లను టార్గెట్ చేస్తూ వచ్చింది. ఛాన్స్ దొరికితే చాలు వారిద్దరినీ విమర్శిస్తూ వచ్చింది. అసలు వాళ్ళిద్దరికీ, పూనమ్ కౌర్కూ మధ్య ఏం గొడవ జరిగిందో మాత్రం ఎవరికీ తెలియదు. ఎప్పుడో త్రివిక్రమ్ గురించి మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్లో ఫిర్యాదు చేసానని చెపుతోంది పూనమ్. అంతలా ఆయన ఏం చేశారు? ఈ విషయం సినీ పెద్దలు ఎందుకు బయటకు రానీయలేదు. పూనమ్ కౌర్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం వెనక ఎవరెవరున్నారు? అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇప్పుడు పూనమ్ ట్వీట్తో అప్పుడు "మా" ఎందుకు స్పందించలేదు? త్రివిక్రమ్పై ఫిర్యాదు తీసుకోకుండా అడ్డుకున్నదెవరు? అంటూ ప్రశ్నలు బయలుదేరాయి. Had maa association taken complaint on trivikram Srinivas , I and many wouldn’t have had the political suffering , I was rather silently ignored , I had given a call tand then complaint to the heads , I want industry big wigs to question Director Trivikram . — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 17, 2024 Also Read: Myanmar: మయన్మార్లో ప్రకృతి బీభత్సం..226మంది మృతి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి