/rtv/media/media_files/2026/05/30/ajith-2026-05-30-10-30-37.jpg)
తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట్లో పెద్ద విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి మోహిని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమె, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
మూడేళ్ల క్రితమే అజిత్ తండ్రి పి.ఎస్. సుబ్రమణియం మరణించగా, ఇప్పుడు తల్లి కూడా దూరమవ్వడంతో అజిత్ కుటుంబంలో తీవ్ర శోకం నెలకొంది. తల్లి మరణంతో అజిత్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.అజిత్ తల్లి మోహిని మరణవార్త తెలుసుకున్న తమిళ, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, దర్శకులు, నటీనటులు తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. అజిత్ కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.
Follow Us