CI Srinivas : బొల్లారంలో తప్ప తాగి సీఐ శ్రీనివాస్‌ వీరంగం

తప్ప తాగి వాళ్లును కాంట్రోల్‌ చేయాల్సిన పోలీసులే మద్యం తాగి కంట్రోల్‌ తప్పుతున్నారు. సీఐ శ్రీనివాస్‌ చేసిన పనికి పోలీస్‌ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. అన్ని స్టేషన్లను కంట్రోల్‌ చేసే కమాండ్‌ కంట్రోల్‌ రూంలో సీఐగా పని చేసే ఓ అధికారి కంట్రోల్‌ తప్పి ఓ వాహనాన్ని ఢీ కొట్టారు.

New Update
CI Srinivas : బొల్లారంలో తప్ప తాగి సీఐ శ్రీనివాస్‌ వీరంగం

CI Srinivas: మద్యం మత్తులో..

తాగుబోతు సీఐ బొల్లారం ( Bollaram) పోలీస్ స్టేషన్ పరిధిలో వీరంగం చేశారు. మద్యం మత్తులో రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం చేశారు. బోయినపల్లి మార్కెట్‌కి కూరగాయల లోడ్‌తో వెళ్తున్న వాహాన్ని ఢీకొట్టారు సీఐ శ్రీనివాస్ ( CI Srinivas). ఈ ప్రమాదంలో కూరగాయల వ్యాన్‌ డ్రైవర్ శ్రీధర్‌ ( Sridhar) తీవ్రగా గాయపడ్డారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాన్వాయ్‌తో సీఐ వచ్చినట్లు సమాచారం.

Drunk CI Srinivas Veeranga except in Bollaram

ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు

హైదరాబాద్ (Hyderabad) బొల్లారంలో తప్ప తాగి ఓ సీఐ వీరంగం సృష్టించారు. పట్టపగలే తప్ప తాగి రోడ్డు ప్రమాదం చేశారు ఓ పోలీస్‌ అధికారి. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ మద్యం మత్తులో కూరగాయల లోడుతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. అయితే సీఐకి చేసిన బ్రీత్‌ అనలైజర్ టెస్ట్‌లో  ( Breath alyzer Test) 201 రీడింగ్‌ వచ్చినట్లు సమాచారం. దీంతో సీఐపై కేసు నమోదు చేశారు బొల్లారం పోలీసులు (Bollaram Police) . ఈ సీఐ డీఎస్పీ ప్రమోషన్‌ లిస్టులో ఉన్నారు. ప్రస్తుతం అతను లీవ్‌లో ఉన్నట్లు సమచారం. అంతే కాకుండా సీఐ శ్రీనివాస్‌ వాహనంపై ఆరు ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు ( Traffic violation cases) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

డ్రైంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన సీఐ

నిన్న రాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ టెస్టులో మాములు వాళ్లను పట్టుకోవాల్సింది పోయి.. పోలీసులే ఇలా తప్ప తాగి డ్రైవ్‌ చేస్తున్నారు. ఇలా చేస్తే ఇక మాములువాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. శ్రీనివాస్‌ వాహనాన్ని వేగంగా నడపడంతో కూరగాయాల వ్యాన్‌ను ఢీకొట్టిందని అక్కడ ఉన్న బాధితులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో వ్యాన్‌ డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన శ్రీధర్‌ ను దగ్గరలో ఉన్న ప్రభుత్వాస్పత్రి ( government hospital)కి తరలించారు పోలీసులు. అంతేకాకుండా అతని వాహానం నుజ్జునుజ్జు అయింది. ఇక ఈ ప్రమాదానికి గురైన సీఐ కారు- వ్యాన్‌ను బొల్లారం పీఎస్‌కు తరలించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read: చంద్రయాన్-3 చుట్టూ ఫేక్ వీడియోలు చక్కర్లు..అసలు నిజం ఇదే..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Dilsukhnagar Bomb Blast : దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు..

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 130 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. కాగా13 సంవత్సరాల విచారణ అనంతరం తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

New Update
Telangana High Court

Telangana High Court

 దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 130 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. కాగా13 సంవత్సరాల పాటు జరిగిన విచారణ అనంతరం రేపు తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: Dia Mirza: HCU వివాదంపై రేవంత్ రెడ్డికి హీరోయిన్ కౌంటర్! అవి AI కాదు రియల్
 
Dilsukhnagar Bomb Blast | దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 130 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన ఎన్‌ఐఏ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు 2016లో మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ సహా ఐదుగురికి మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే, కేసులో ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అయితే, ఈ శిక్షను సవాల్‌ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. మంగళవారం తుది తీర్పు ఇవ్వనున్నది. కోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందో తనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: చెయ్యి విరిగినా బుద్దిరాలే.. ట్రాఫిక్‌లో IPL మ్యాచ్ చూసినందుకు చుక్కలు కనబడ్డాయి- ఏం జరిగిందో తెలుసా?

21న ఫిబ్రవరి 2013లో దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లు సంభవించాయి. ఎన్‌ఐఏ రంగంలోకి దిగి విచారణ జరిపింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది. ఈ ఘటనలో ఇండియన్‌ ముజాహిద్‌ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌ ప్రధాన నిందితుడిగా తేలింది. ఈ ఘటనలో అసదుల్లా అక్తర్‌, వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌, ఎజాజ్‌ షేక్‌, సయ్యద్‌ మక్బూల్‌ని నిందితులుగా గుర్తించారు. మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు విచారణ తర్వాత నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్‌ భత్కల్‌ను 2013లో నేపాల్‌ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: MLA Raja Singh : ఒవైసీ బ్రదర్స్‌ను కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్

Advertisment
Advertisment
Advertisment