/rtv/media/media_files/2025/04/08/uj1j4zv8Y3N7hYRiSE2z.jpg)
aluru
కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి తీరు వివాదాస్పమైంది. ఆదివారం దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా రామాలయాల్లో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపించారు. ఈ క్రమంలోనే ఆలూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే విరూపాక్షి సొంతూరు చిప్పగిరిలో శనివారం రాములోరి కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు ఎమ్మెల్యే తీరును తప్పుబడుతున్నారు.
Also Read: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
సాధారణంగా సీతారాముల కళ్యాణంలో భాగంగా అర్చకులు శ్రీరాములవారి తరుపున సీతమ్మ మెడలో మంగళసూత్రాన్ని ఉంచుతారు. భక్తులకు మంగళసూత్రాన్ని చూపించిన తర్వాత.. ఆ రాములోరి తరుఫున సీతమ్మ మెడలో మంగళసూత్రాన్ని పండితులు ఉంచుతారు. అయితే ఆలూరు ఎమ్మెల్యే మాత్రం తానే స్వయంగా సీతాదేవి మెడలో మంగళసూత్రాన్ని వేయడం వివాదాస్పదమవుతోంది.
Also Read: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావటంతో నెటిజన్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల వారైనా ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే విరూపాక్షి స్పందించాల్సి ఉంది.
సీతమ్మ వారి మంగళసూత్రం తాకి ఇవ్వమని, ఎమ్మెల్యే విరూపాక్షికి పండితులు తాళి ఇచ్చారు. అయితే.. ఆ తాలిని కళ్ళకు అద్దుకోవాల్సింది పొగా... పొరపాటున సీతమ్మవారికి ఆ మంగళసూత్రాన్ని కట్టేశారు ఎమ్మెల్యే విరూపాక్షి.అయితే ఈ తథంగాన్ని అడ్డుకోకుండా పండితులు కూడా అక్షింతలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో... ఎమ్మెల్యే పై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో ఎమ్మెల్యే విరూపాక్షి క్షమాపణలు కూడా చెప్పారు . పండితులు కట్టమంటే... తాను సీతమ్మ మెడలో తాళిబొట్టు కట్టినట్లు తెలిపారు. 15 సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేస్తున్నానని కూడా క్లారిటీ ఇచ్చారు విరూపాక్షి.
Also Read:Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు!
Also Read: Ap :ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్...ఎక్కువ మందికి ఈ పది రకాల జబ్బులు!
ycp-mla | kurnool | ap | aluru | mla virupakshi | sri-rama-navami | latest-news | telugu-news | latest telugu news updates
Nandyala : పెద్ద సైకో తాడేపల్లెలో చిన్న సైకో నంద్యాలలో.. వారంతా దొంగ పోలీసులే : చంద్రబాబు!
ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నంద్యాల సభలో హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ నాయకులు చీకటి రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేస్తున్నారన్నారు. పెద్ద సైకో తాడేపల్లెలో ఉంటే చిన్న సైకో నంద్యాలలో ఉన్నాడంటూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు.
Chandrababu Shocking Comments On Jagan : ఏపీ ఎన్నికల(AP Elections) ప్రచారంలో భాగంగా టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) శనివారం నంద్యాల సభలో హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ నాయకులు చీకటి రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేస్తున్నారన్నారు. పెద్ద సైకో తాడేపల్లెలో ఉంటే చిన్న సైకో నంద్యాలలో ఉన్నాడంటూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు.
దొంగ పోలీసులు వచ్చి అరెస్టు చేశారు..
ఈ మేరకు చంద్రబాబు మాట్లాడుతూ.. నంద్యాల(Nandyala)కు రాగానే సెప్టెంబర్ 9 గుర్తొస్తుందని చెప్పారు. నంద్యాలకు దొంగ పోలీసులు వచ్చి అరెస్టు చేశారని, నంద్యాల ఎమ్మెల్యే ఇక్కడ ఏమైనా చేశాడా అంటూ ప్రశ్నించారు. ఐదేళ్లలో ఏమి చేయలేదని, ఇకపై కూడా చేయడన్నారు. ఇక పవన్ కోసం జనసేనా జెండాలు పట్టుకుని వచ్చిన అల్లు అర్జున్ ను వేరే పార్టీలు వాడుకోడం నీచమైన పని అన్నారు. మీ ఇంటికి అల్లు అర్జున్ వస్తే ఇలా వాడుకోవడం చౌకబారు రాజకీయం. ఇలాంటి తప్పుడు, చౌక బారు రాజకీయాలు ఎవ్వరూ చెయ్యరు. వైసీపీ నాయకులు చీకటి రాజకీయాలు,చెత్త రాజకీయాలు చేస్తున్నారు. పెద్ద సైకో తాడేపల్లెలో ఉంటే చిన్న సైకో నంద్యాలలో ఉన్నాడన్నారు.
ఇది కూడా చదవండి: Elections 2024: ష్.. గప్ చుప్.. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం!
అలాగూ ఉద్యోగాలు కావాలంటే కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే చేస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. పింఛన్ రూ.4 వేలకు పెంచి ఏప్రిల్ నుంచే అందిస్తామన్నారు. దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్ ఇస్తామన్నారు. భూమి పాసు పుస్తకంపై రాజముద్ర ఉండాలి.. సైకో ఫొటో కాదంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని.. కూటమిదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.
Ap Kurnool MLA:ఏపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. సీతమ్మ మెడలో తాళి కట్టిన వైనం.. వీడియో వైరల్
వైసీపీ నేత, కర్నూలు జిల్లా ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షి వివాదంలో చిక్కుకున్నారు.రాములోరి కళ్యాణంలో ఎమ్మెల్యే విరూపాక్షి సీతమ్మ మెడలో తాళి కట్టడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
🔴Live News: అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు.. కాళ్లు, చేతులకు గాయాలు
BIG BREAKING: అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు.. కాళ్లు, చేతులకు గాయాలు!
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాడు. సింగపూర్లో ఆయన చదువుకుంటున్న స్కూళ్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Alekhya Chitti Pickles Issue: చావుబతుకుల్లో అలేఖ్య చిట్టి.. చిన్న పిల్లయ్యా- ఎమోషనల్ వీడియో
అలేఖ్య చిట్టి హాస్పిటల్లో చేరింది. బ్రీతింగ్ ఇష్యూతో ICU వార్డులో కొట్టిమిట్టాడుతుంది. తన చెల్లికి సీరియస్గా ఉందని సుమీ ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్
Ap :ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్...ఎక్కువ మందికి ఈ పది రకాల జబ్బులు!
ఏపీ ప్రభుత్వం ‘ఆరోగ్య ఆంధ్ర’కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది..ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది.రాష్ట్రంలో 80% మంది ప్రజలు పది రకాల జబ్బులతో బాధపడుతున్నట్లు నివేదికలు తెలిపాయి.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Posani Krishna Murali: పోసానికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్?
పోసాని కృష్ణమురళికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న విచారణకు రావాలని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Stock Market: నిన్న అధ:పాతాళానికి..ఈరోజు లాభాల్లో..
Road Accident: మియాపూర్లో లారీ బీభత్సం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి.. మరో ఇద్దరికి సీరియస్!
Over Thinking: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు
Bengaluru: బెంగళూరులో లైంగిక వేధింపులు కామన్..హోంమంత్రి పరమేశ్వర వివాదాస్పద కామెంట్స్!
Ap Kurnool MLA:ఏపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. సీతమ్మ మెడలో తాళి కట్టిన వైనం.. వీడియో వైరల్