AP High Court:చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణను వాయిదా వేసిన హైకోర్టు
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈరోజు విచారించింది. తరువాత దీన్ని తదుపరి విచారణ కోసం డిసెంబర్ 1కి వాయిదా వేసింది. దాంతో పాటు మాజీ మంత్రి నారాయన, ఆయన అల్లుడు కేసులను కూడా హైకోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.
రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది. ఐఆర్ఆర్ మాస్టర్ ప్లాన్లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. తరువాత హైకోర్టు దీని విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది. మరోవైపు అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ మాజీ మంత్రి నారాయణ పిటిషన్ మీద కూడా ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై విచారణను ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. వచ్చే నెల అంటే డిసెంబర్ 11వ తేదీకి ఈకేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.
ఇంకోవైపు మాజీ మంత్రి నారాయణ అల్లుడు వరుణ్ కు సిఐడి జారీ చేసిన లుక్ ఔట్ సర్క్యులర్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్ మీద కూడా న్యాయస్థానం విచారణ చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి సీఐడీ కోర్టును సమయం కోరింది. దీంతో ఉన్నత న్యాయస్థానం ఈ కేసు విచారణను వచ్చే నెల 6నకు వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ-19 నిందితుడిగా వరుణ్ ఉన్నారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఏడురోజుల పాటు జపాన్లో పర్యటించిన సీఎం రేవంత్ బృందం కీలక ఒప్పందాల చేసుకుంది. మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులు సాధించింది. దీనిద్వారా తెలంగాణలో యువతకు 30,500 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
CM Revanth Team in Japan
Apr 23, 2025 08:24 IST
ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఆయనేనా?
ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎవరు వెళ్లనున్నారు అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అయితే ఈ రేసుల తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, మంద కృష్ణమాదిగ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
mandakrishna
Apr 23, 2025 08:24 IST
మాజీ క్రికెటర్ కన్నుమూత
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కీత్ స్టాక్పోల్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న కీత్ గుండె పోటుతో మృతి చెందారు. కీత్ ఆస్ట్రేలియా తరఫున 43 టెస్ట్ మ్యాచ్లు, 6 వన్డేలు ఆడాడు.
Former cricketer Keith Stackpole
Apr 23, 2025 08:23 IST
సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలో ముగించుకున్నారు. వెంటనే ప్రత్యేక విమానంలో ఆయన హుటాహుటిన బయలుదేరి ఈరోజు ఉదయానికి ఢిల్లీ చేరుకున్నారు.
PM Modi
Apr 23, 2025 08:22 IST
మాజీ క్రికెటర్కు నాలుగేళ్ల జైలు శిక్ష
గృహ హింస కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్కు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఏడాది నుంచి కస్టడీలో ఉంటున్న అతనిది సస్పెన్షన్తో కూడిన శిక్ష కావడంతో వెంటనే విడుదల కానున్నాడు. వచ్చే ఐదేళ్లలో తీవ్రమైన నేరానికి పాల్పడితే ఈసారి జైల్లో ఉండాలి.
Apr 23, 2025 08:22 IST
ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో హైదరాబాద్కు చెందిన ఐబీ అధికారి మనీష్ రంజన్ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
maneesh
Apr 23, 2025 08:20 IST
నేడు పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల
ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను నేడు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు. https://bse. ap. gov. in, https://apopenschool. ap. gov. in/ ద్వారా తెలుసుకోవచ్చు.]
Apr 23, 2025 08:19 IST
పహల్గాం ఉగ్రదాడి..మోడీకి ట్రంప్ ఫోన్!
జమ్మూ కశ్మీర్ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోడీతో ఫోన్ లో మాట్లాడారు. ఉగ్రదాడిలో బలైన వారికి సంతాపం తెలిపారు.ఉగ్ర ఘటనను ట్రంప్ తీవ్రంగా ఖండించారు.