SBI New Chairman: ఎస్బీఐ ఛైర్మన్గా తెలంగాణ బిడ్డ.. గద్వాల్ వాసికి అరుదైన గౌరవం! తెలంగాణ గద్వాల్కు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఛైర్మన్గా ఎన్నికయ్యారు. ఆయన నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే ఎస్బీఐలో సీనియర్మేనేజింగ్డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీనివాసులు 3ఏళ్లపాటు ఛైర్మన్ పదవిలో కొనసాగనున్నారు. By srinivas 08 Aug 2024 in బిజినెస్ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి Challa Srinivasulu: తెలంగాణ గద్వాల్ కు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'కు ఛైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే ఎస్బీఐలో సీనియర్మేనేజింగ్డైరెక్టర్(MD)గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు.. 3ఏళ్లపాటు ఛైర్మన్ పదవిలో కొనసాగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పనితీరు, మొత్తం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని చల్లా శ్రీనివాసులు శెట్టిని ఎస్బీఐ చైర్మన్ పదవికి సిఫార్సు చేశామని ఎఫ్ఎస్ఐబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎఫ్ఎస్ఐబీ సిఫార్సు మేరకు ఆమోదం.. ఈ మేరకు ప్రస్తుత ఛైర్మన్దినేశ్ కుమార్ఖారా ఆగస్టు 28న పదవీ విరమణ చేయగానే.. అదే రోజు శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. ఆర్థికసేవల విభాగం ప్రతిపాదన మేరకు మంత్రి వర్గ నియామకాల సంఘం శ్రీనివాసులు శెట్టి పదవికి ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎస్బీఐ చైర్మన్ పదవికి గరిష్ట వయో పరిమితి 63 ఏళ్లుగా నియమించారు. ఇక ఎస్బీఐ చైర్మన్ పదవికి చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. కాగా అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్, టెక్నాలజీ వర్టికల్స్కు సంబంధించిన కార్యకలాపాలను శ్రీనివాసులు చూసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: Anganwadi: నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్వాడీ కేంద్రాల్లో 9వేల ఉద్యోగాలు! గద్వాల జిల్లా పెద్దపోతులపాడులో జన్మించి.. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడులో జన్మించిన శ్రీనివాస్.. అగ్రికల్చర్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. అయితే తన వృత్తి జీవితాన్ని ఎస్బీఐలో 1988లో ప్రొబేషనరీ అధికారిగా(పీఓ)గా మొదలుపెట్టారు. ఎస్బీఐలో సుమారు 35 ఏళ్లుగా పనిచేస్తున్న శ్రీనివాసులు శెట్టి ప్రస్తుతం ఆ బ్యాంకులోనే అత్యున్నతమైన స్థాయికి చేరుకున్నారు. ఇక ఎస్బీఐలో పనిచేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ల బృందం నుంచి చైర్మన్ ను నియమిస్తారు. దీనిపై నిర్ణయం తీసుకునే క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ)కి ఎఫ్ఎస్ఐబీ పేరును సిఫారసు చేస్తుంది. ఏసీసీకి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారు. #challa-sreenivasulu-setty #sbi-chairman సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి