AP News: ‘ఆడుదాం ఆంధ్రా’.. రోజా రూ.100 కోట్లు కొట్టేసిందా? సీఐడీకి ఫిర్యాదు

మాజీ మంత్రి రోజాకు రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్‌ బిగ్ షాక్ ఇచ్చారు. ‘ఆడుదాం ఆంధ్రా’, ‘సీఎం కప్‌’ల పేరుతో రోజా భారీ అవినీతికి పాల్పడ్డట్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇందులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు కూడా చేర్చిన ఆయన ఇద్దరిపై విచారణ జరపాలని కోరారు.

New Update
AP News: ‘ఆడుదాం ఆంధ్రా’.. రోజా రూ.100 కోట్లు కొట్టేసిందా? సీఐడీకి ఫిర్యాదు

Roja: మాజీ మంత్రి రోజాకు ఊహించని షాక్ తగిలింది. వైసీపీ ప్రభుత్వంలో క్రీడల శాఖ మాజీ మంత్రిగా పనిచేసిన రోజా ‘ఆడుదాం ఆంధ్రా’, ‘సీఎం కప్‌’ల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారంటూ సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్‌ తెలిపారు. ఇందులో శాప్‌ మాజీ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు కూడా చేర్చినట్లు చెప్పారు.

‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో..
ఈ మేరకు గురువారం విజయవాడలో విలేకర్లతో మాట్లాడిన ప్రసాద్.. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో జరిగిన రూ.100 కోట్ల అక్రమాలపై సీఐడీ విచారణ కోరుతూ ఈ నెల 11న అదనపు డీజీపీ (సీఐడీ)కి ఫిర్యాదు చేశాను. వారి హయాంలో పనిచేసిన శాప్‌ ఎండీలు, శాప్‌ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల్లోని డీఎస్‌డీవోలపై విచారణ జరపాలని కోరాను. క్రీడా కోటా ద్వారా మెడికల్, ఇంజినీరింగ్, ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలు పొందిన వారిపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఆ అవకతవకలను కూడా పరిశీలించాలి..
నాటి కార్యక్రమాలకు సంబంధించిన దస్త్రాలన్నీ సీజ్‌ చేయాలి. ఐదేళ్ల కాలంలో శాప్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను కూడా పరిశీలించాలి. ఈ సమావేశంలో మోడరన్ ఖోఖో సంఘం అధ్యక్షుడు రత్తుల అప్పలస్వామి, టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి ఆర్. బాబు నాయక్, కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కేవీ నాంచారయ్య పాల్గొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ సుమో.. స్పాట్లో ఏడుగురు!

తిరుమలలో 35వ మలుపు వద్ద ఓ సుమో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఏడుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

New Update
ttd crime news

ttd crime news

AP Crime: తిరుమల నుండి తిరుపతికి వెళ్తున్న ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డుప్రమాదం భక్తుల్లో ఆందోళన కలిగించింది. సోమవారం ఉదయం 35వ మలుపు వద్ద ఓ సుమో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ వాహనంలో ఏడుగురు కర్ణాటకకు చెందిన భక్తులు ప్రయాణిస్తున్నారు. తిరుమలలో స్వామివారి దర్శనం పూర్తిచేసుకుని తిరుపతికి తిరుగుబాటుగా బయలుదేరిన ఈ వాహనం అతి వేగంగా వచ్చిన సమయంలో మలుపులో నియంత్రణ కోల్పోయింది. వాహనం బోల్తా పడటంతో అందులో ఉన్న వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

అతి వేగంతో..

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి సమాచారాన్ని పోలీసులకు, 108 ఎమర్జెన్సీ సర్వీసులకు అందించారు. వెంటనే రెస్క్యూ టీమ్‌ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన భక్తులను బయటకు తీసి చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిగతావారికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ వేగంగా నడిపిస్తున్నాడని, కొన్ని సార్లు మలుపుల్లో కాస్త భయంగా అనిపించినట్లు గాయపడిన ఓ భక్తుడు తెలిపారు.

 

ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఘాట్ రోడ్డులో వాహనాల వేగంపై నియంత్రణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భక్తులు ప్రయాణ సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.   

ఇది కూడా చదవండి: వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్!

( ap-crime-news | ap crime updates | ap crime latest updates | latest-news)

Advertisment
Advertisment
Advertisment