National: ఉద్యోగుల సామాజిక భద్రతకు యూనిఫైడ్ ఫించన్‌ – ‌‌‌23 లక్షల మందికి లబ్ధి

ఉద్యోగుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పింఛన్ పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా 23 లక్షల మందికి లాభం చేకూరనుంది. ఈరోజు ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి వర్గం దీనిని ఆమోదించింది.

New Update
National: ఉద్యోగుల సామాజిక భద్రతకు యూనిఫైడ్ ఫించన్‌ – ‌‌‌23 లక్షల మందికి లబ్ధి

Unified Pension: కేంద్ర కేబినెట్ ఈ రోజు మూడు నిర్ణయాలను తీసుకుంది. బయో ఈ-3 విధానంతోపాటు విజ్ఞాన్‌ ధార పథకం, 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ కల్పనకు ఆమోదం తెలిపింది. వీటితో పాటూ ఉద్యోగుల భద్రత కోసం యూనిఫైడ్ పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మొత్తం 23 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. దీనిని ఉద్యోగులు ఎన్పీసీ, యూపీఎస్‌ల మధ్య ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

ఈ పథకంలో భాగంగా కనీసం 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణకు ముందు 12 నెలల సగటు మూల వేతనంలో 50 శాతం పెన్షన్‌గా ఈ పథకం హామీ ఇస్తుంది. ఒకవేళ పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబానికి చివరగా డ్రా చేసిన మొత్తంలో 60 శాతం అమౌంట్ ను పొందుతారు. ఇక ఈ పథకం వలన కనీసం పది ఏళ్ళ సర్వీస్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత నెలకు పదివేలు హామీ ఇస్తుంది. ప్రస్తుత పెన్షన్ స్కీమ్ ప్రకారం.. ఉద్యోగులు 10 శాతం విరాళంగా ఇవ్వగా, కేంద్ర ప్రభుత్వం 14 శాతం వాటాను అందిస్తోంది. ఇది ఇప్పుడు UPSతో 18 శాతానికి పెరగనుంది.

Also Read: Viral Post: పెద్దగా పని చేయకుండానే 3 కోట్ల జీతం‌‌‌‌–అమెజాన్ ఉద్యోగి పోస్ట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Allu Arjun- Atlee: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ హైప్ నెలకొంది. బన్నీ డ్యూయల్ రోల్, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఉండనున్నారని టాక్‌ ప్రచారంలో ఉంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది.

New Update
Allu Arjun – Atlee

Allu Arjun – Atlee Movie

Allu Arjun- Atlee : ఇటీవల టాలీవుడ్ లో హైప్ క్రియేట్ చేసిన ఓ భారీ ప్రాజెక్ట్ ఏమిటంటే.. అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందనున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన నాటి నుంచి ఎన్నో ఆసక్తికర రూమర్స్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై, కొన్ని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారన్న టాక్ హీట్ పెంచింది. అంతేకాదు, ఈ చిత్రానికి గ్లోబల్ స్టాండర్డ్స్‌ను లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల, హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ టాప్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు తెరపైకి వచ్చింది. హాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెను ఎంపిక చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

ఇప్పటికే ప్రియాంక చోప్రా, మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఇంటర్నేషనల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన కూడా ఆమె కనిపిస్తే, అది మరో క్రేజీ కాంబోగా మారనుంది. అయితే దీనిపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.

ఈ గ్రాండ్ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. బడ్జెట్ పరంగా, విజువల్ ట్రీట్ పరంగా ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో తెరకెక్కించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం.

Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

మొత్తానికి అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్‌ను సృష్టించగా, కథ, తారాగణం, టెక్నికల్ టీమ్ డీటెయిల్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment