AP : చంద్రబాబుకు భధ్రత పెంచిన కేంద్రం.. ఆ ప్రాంతాలను జల్లెడ పడుతున్న కమెండోలు! టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం భధ్రత మరింత పెంచింది. రెండు బ్యాచ్ లుగా 24 మంది ఎస్పీజీ బ్లాక్ కాట్ కమెండోలను కేటాయించింది. టీడీపీ ఆఫీసు, కరకట్టలో చంద్రబాబు ఇళ్లు, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి కరకట్ట మార్గంతోపాటు చంద్రబాబు పయనించే తదితర ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. By srinivas 16 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Increased Security Of Chandrababu : టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandra Babu Naidu) కు కేంద్రం భధ్రత పెంచింది. ఎన్నికల(Elections) వేళ ఏపీ(AP) లో జరుగుతున్న అల్లర్ల సందర్భంగా సెక్యూరిటీ కల్పించినట్లు తెలుస్తుండగా.. అదనంగా 12×12 రెండు బ్యాచ్ లుగా 24 మంది ఎస్పీజీ బ్లాక్ కాట్ కమెండోలను కేటాయించారు. అంతేకాదు రెండు రోజుల క్రితం కేంద్రం నుంచి వచ్చిన భధ్రతాధికారులు టీడీపీ(TDP) కార్యాలయం, కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి కరకట్ట మార్గంతోపాటు చంద్రబాబు పయనించే తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఇదిలా ఉంటే.. యూపీ సి.ఎం యోగీ ఆదిత్యనాధ్, కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ లకు రక్షణ తగ్గించి.. చంద్రబాబుకు పెంచటంపై పొలిటికల్ సర్కిల్ ల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. Also Read : దెందులూరులో టెన్షన్.. చింతమనేని ప్రభాకర్పై మరో కేసు..! #chandrababu #increased-the-security #tdp #central-government సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి