CBSE : తొమ్మిదొవ తరగతి పుస్తకంలో డేటింగ్, రిలేషన్‌షిప్స్‌ పాఠాలు!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 9వ తరగతి విలువ విద్య పాఠ్యపుస్తకంలో లవ్, డేటింగ్, రిలేషన్స్‌ వంటి ఇతర అంశాలకు సంబంధించిన పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది.

New Update
CBSE : తొమ్మిదొవ తరగతి పుస్తకంలో డేటింగ్, రిలేషన్‌షిప్స్‌ పాఠాలు!

Dating And Relationships : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. టీనేజీ దశలోకి అడుగుపెడుతున్న యువతీ యువకులకు లవ్(Love), డేటింగ్(Dating), రిలేషన్‌షిప్(Relationship) వంటి విషయాలను స్కూల్ దశనుంచే నేర్పించేందుకు రిలేషన్షిప్ ఎడ్యుకేషన్ అధ్యాయాలను ప్రవేశపెట్టింది. ఈ మేరకు 9వ తరగతి(IX Class) విలువ విద్య పాఠ్యపుస్తకంలో ప్రేమ, డేటింగ్, రిలేషన్స్‌ వంటి ఇతర అంశాలపై పాఠ్యాంశాలను బోధించనున్నట్లు తెలిపింది.

క్రష్‌ అండ్ ఫ్రెండ్ షిప్..
ఈ పాఠాలను పూర్తిగా డేటింగ్, రిలేషన్‌షిప్‌కు సంబంధించిన చిన్న చిన్న విషయాలను చర్చించేందుకు తయారు చేశారు. ఇందులో గోస్టింగ్, క్యాట్ ఫిషింగ్, సైబర్ బెదిరింపులు వంటి వాటిని వివరించేలా ఉన్నాయి. వీటితోపాటు క్రష్‌లు, ప్రత్యేక స్నేహాలు వంటి వాటిని కూడా సాధారణ కథలుగా ఉదాహరణలతో సహా వివరించారు. ఇక బుక్ లో పాఠ్యాంశానికి సంబంధించిన ఫొటోలను ఓ నెటిజన్ ట్విటర్‌(X) లో పంచుకోవడంతో సోషల్ మీడియా(Social Media) లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కాలంలో 9 వ తరగతి పాఠ్య పుస్తకాలు ఇలా ఉన్నాయని.. ఆ నెటిజన్ పేర్కొన్నారు. ఈ పాఠాలను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.

Also Read : అత్యాచారం చేశాడని యువతి పిటిషన్.. నిందితునికి సపోర్ట్‌ చేసిన కోర్టు ..

హర్షం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..
అయితే ప్రస్తుత కాలంలో ఇలాంటి విషయాలను వివరించేందుకు సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్ అయిన టిండర్ ఇండియా ట్విటర్‌లో స్పందించింది. ఇక తర్వాతి పాఠం బ్రేకప్‌ల గురించి ఉంటుందేమో అని పేర్కొంది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'ఈ పుస్తకాన్ని నాకు పంపించండి.. మొత్తం చాప్టర్‌ను నేను చదవాల్సిన అవసరం ఉంది' అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక గతంలో తమకు అబ్బాయిలతో స్నేహం చేయడానికి కూడా అనుమతి లేకపోయేదని మరొక నెటిజన్ పేర్కొన్నారు. ఇది చాలా మంచి నిర్ణయమని.. ఇంకో నెటిజన్ ట్వీట్ చేశారు. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో చిన్న పిల్లలకు ఆన్‌లైన్‌లో చాలా విషయాలు అందుబాటులో ఉంటున్నాయని.. అయితే ఇలాంటివి ప్రవేశపెట్టడం వల్ల చెత్త అంతా నేర్చుకోకుండా ఉంటుందని తెలిపారు. ఇలాంటివి మంచి భాగస్వాములను ఎంచుకునేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

నిజమైన అభివృద్ధి..
నిజాయితీగా చెప్పాలంటే ఇది చాలా గ్రేట్ అని మరో నెటిజన్ తెలిపారు. ఇదే భారత విద్యా వ్యవస్థ(Indian Education System) లో ప్రతీ ఒక్కరు కోరుకున్న నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. ఇది చాలా అవసరమని మరొకరు ట్వీట్ చేశారు. టీనేజీ దశలో ప్రేమల కారణంగా సూసైడ్‌లు, డిప్రెషన్‌లోకి వెళ్లడం, మత్తు పదార్థాలకు బానిక కావడం వంటివి జరుగుతున్నాయని.. వాటిని అరికట్టేందుకు ఇలాంటి పాఠ్యాంశాలు చాలా అవసరమని పేర్కొన్నారు. డేటింగ్, పెళ్లి, రిలేషన్‌షిప్, విడాకులు, లవ్, బ్రేకప్‌లు మనిషి జీవితంలో ఒక భాగాలేనని.. అవన్నీ 20 ఏళ్లకు ముందే తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువతకు వారి జీవితాల్లో రిలేషన్‌లను ఎలా ఎంచుకోవాలి.. వాటిని ఎలా కంట్రోల్‌ చేసుకోవాలి.. ఎలా ముందుకు నడిపించాలి అనే విషయాలను నేర్చుకునేందుకు ఇదొక సరైన విధానమని అంటున్నారు.

Also Read : ఏపీ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది? షర్మిలా ఏం చేయబోతున్నారు?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

All India Civil Services ఇప్పటివరకు ఫోన్ వాడలేదు.. ఆల్ ఇండియా సివిల్స్ లో తెలంగాణ అమ్మాయికి 11వ ర్యాంకు

వరంగల్ కి చెందిన సాయి శివాని అనే విద్యార్థిని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లోనూ సాయిశివాని రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు, జోనల్ 1లో 11వ ర్యాంకు సాధించింది.

New Update

All India Civil Services సాధారణంగా చాలామంది సివిల్స్ క్లియర్ చాలా కష్టమని భావిస్తారు. కానీ కస్టపడి చదివితే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని మరో సారి నిరూపించింది ఈ అమ్మాయి. తెలుగు తేజం సాయిశివాని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 

Also Read: Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

సివిల్స్ లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు 

వరంగల్ కి చెందిన సాయి శివాని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసిన సాయి శివాని.. ఆ తర్వాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టింది. కలెక్టర్  కలతో అహర్నిశలు కష్టపడింది. ప్రణాళికతో రోజుకు 12 గంటలు చదివింది. మొదటి సారి విఫలమైనా.. నిరాశ చెందలేదు. మళ్ళీ కష్టపడి చదివింది. రెండో ప్రయత్నంలో ఆల్ ఇండియా స్థాయిలో  11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.  2023లో ఐదు మార్కులతో సాయిశివాని ప్రిలిమ్స్ మిస్సయింది. తిరిగి 2025లో తన కల నెరవేర్చుకుంది. 

Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

ఈ సందర్భంగా సాయిశివాని మాట్లాడుతూ.. ఇంతవరకు ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే తన కల నెరవేరడానికి కారణమని తెలిపింది. కలెక్టర్ కావాలనే లక్ష్యంతో కఠోర సాధన చేశాను. రోజుకు 12 గంటలు చదివాను. ఒత్తిడిని జయించడానికి యోగా, భగవద్గీత చదివేదాన్ని. ఈ విజయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారం మరువలేనిది అని చెప్పింది. 

latest-news

Also Read: AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

Also Read: Viral Video అందరి ముందు భుజం పై నుంచి విజయ్ చేయి తీసేసిన విద్యార్ధి.. ఏం జరిగిందంటే

Advertisment
Advertisment
Advertisment