NEET Paper Scam: నీట్ పేపర్ లీక్.. ఇద్దరు అరెస్టు నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సీబీఐ అధికారులు ముందడుగు వేశారు. బీహార్ కేంద్రంగా నీట్ పేపర్ లీక్కు పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని గురువారం అరెస్టు చేశారు. పాట్నాకు చెందిన మనీష్ కుమార్, అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. By B Aravind 27 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో సీబీఐ అధికారులు ముందడుగు వేశారు. బీహార్ కేంద్రంగా నీట్ పేపర్ లీక్కు పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని గురువారం అరెస్టు చేశారు. పాట్నాకు చెందిన మనీష్ కుమార్, అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. Also Read: కొత్త పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ? రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. లీకేజీకి ప్రధాన కేంద్రాలుగా అనుమానిస్తున్న బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. అయితే మనీష్ కుమార్ నీట్ పేపర్ను 12 మంది విద్యార్థులు, అంతకంటే ఎక్కువ మందికి ఇచ్చాడని సీబీఐ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరో నిందితుడు అశుతోష్.. లీకైన నీట్ పేపర్ చదువుకునేందుకు వీలుగా తన ఇంటిని, నిరూపయోగంగా ఉన్న ఓ స్కూల్ను వాడుకున్నట్లు సీబీఐ గుర్తించింది. Also Read: హైదరాబాద్లో భారీ వర్షం.. రంగంలోకి జీహెచ్ఎంసీ #WATCH | NEET paper leak matter | CBI team arrives at CBI office in Patna, Bihar with accused Baldev Kumar alias Chintu and Mukesh Kumar. A Special CBI Court in Patna sent both to CBI remand, yesterday. pic.twitter.com/mvQhG2aplH — ANI (@ANI) June 27, 2024 #telugu-news #neet-scam #neet-paper-leak సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి