Car Accident: ఏపీలో కారు భీభత్సం.. భయంతో పరుగులు తీసిన జనం: వీడియో ఏపీలోని మారేడుమిల్లిలో కార్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ఓ ఇంటివైపు దూసుకెళ్లింది. స్థానికులు భయంతో పరుగులు పెట్టగా కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అదే చోట స్కూటీ అదుపుతప్పి ఓ వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. By srinivas 04 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Accident: అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ, మారేడుమిల్లిలో కార్ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన జనవాసాల్లోకి దూసుకెళ్లింది మారుతి కారు. భయంతో స్థానికులు పరుగులు తీశారు. అయితే ప్రమాద సమయంలో కార్ లో ఉన్న నలుగురికి గాయపడగా ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. https://rtvlive.com/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-04-at-5.51.42-PM.mp4"> ఇదిలా ఉంటే.. రంపచోడవరం మండలం ఐ.పోలవరం వద్ద ఓ స్కూటీ తుప్పలోకి దూసుకెళ్లింది. అతి వేగంలో కంట్రోల్ తప్పి ఈ ప్రమాదం జరగగా.. స్కూటీపై వెళుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే వీకెండ్ ఆదివారం కాడంతో ఏజెన్సీ ప్రాంతం వైపు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారని, ఈ క్రమంలోనే అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. #car-accident #alluri-district సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి