CAG Report On Telangana Revenue: తెలంగాణలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత లేదు.. కాగ్ నివేదిక

తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత కరువైందని కాగ్ నివేదిక పేర్కొంది. గత ప్రభుత్వం విద్య, వైద్యం మీద ఖర్చుల విషయంలో వెనుకంజలో ఉందని తెలిపింది. మొత్తం వ్యయంలో.. విద్య మీద 8 శాతం ఖర్చు చేయగా, వైద్యం కోసం 4 శాతం మాత్రమే ఖర్చు చేశారని తెలిపింది.

New Update
CAG Report On Telangana Revenue: తెలంగాణలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత లేదు.. కాగ్ నివేదిక

CAG Report On Telangana Revenue Department: ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్, రెవెన్యూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ ఇచ్చిన నివేదికను ప్రెవేశ పెట్టారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాగ్ ఇచ్చిన నివేదికలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.

ALSO READ: వాహనదారులకు బిగ్ అలర్ట్.. మరికొన్ని గంటలు మాత్రమే!

పంచాయతీ రాజ్ శాఖ... పంక్చర్!

పంచాయతీ రాజ్ శాఖపై కాగ్ ఇచ్చిన నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో గ్రాంట్ల మళ్లింపు జరిగిందని పేర్కొంది. నిధుల దుర్వినియోగం జరిగినట్లు తెలిపింది. బకాయిలు వసూలు చేయడంలో గత ప్రభుత్వం విఫలం అయిందని పేర్కొంది. కొన్ని పనులకు అధిక బిల్లులు చెల్లించారని.. సకాలంలో రికార్డులు సమర్పించలేదని మొట్టికాయలు వేసింది.

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత లేదు...

తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత కరువైందని కాగ్ నివేదిక పేర్కొంది. గత ప్రభుత్వం విద్య, వైద్యం మీద ఖర్చుల విషయంలో వెనుకంజలో ఉందని తెలిపింది. మొత్తం వ్యయంలో.. విద్య మీద 8 శాతం ఖర్చు చేయగా, వైద్యం కోసం 4 శాతం మాత్రమే ఖర్చు చేశారని తెలిపింది. గడిచిన మూడు సంవత్సరాలుగా రెవెన్యూ రాబడిని సాధించడంలో విఫలం అయిందని వెల్లడించింది. ద్రవ్య లోటు 46,638 కోట్లు, అప్పుల నిష్పత్తి GSDP తో పోలిస్తే 37.77 శాతం అని.. FRMB పరిమితి తో తెలంగాణ రాష్ట్ర అప్పుల నిష్పత్తి 12.77 శాతం ఎక్కువగా ఉందని తెలిపింది. 15వ ఆర్థిక సంఘంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర నిష్పత్తి 8. 47% ఎక్కువ అని తేల్చి చెప్పింది. మొత్తం రాష్ట్రం సొంత పనుల నుంచి షాపులు రిజిస్ట్రేషన్లు వస్తుసేవల పన్ను అమ్మకాలు ఇవన్నీ 91,270 కోట్లు రాష్ట్రానికి రాబడి అని.. 2021-22 లో వ్యవహారిక వ్యయం 1,36,804 కోట్ల రూపాయలుగా పేర్కొంది. వ్యవహారిక విషయంలో జీతాలు, పెన్షన్ల మీద ఖర్చు తగ్గిందని తెలిపింది.

చెప్పింది కొండంత.. చేసింది గోరంత..

గత ప్రభుత్వం రెవెన్యూ రాబడి ఎక్కువ చూపించి.. లోటును తక్కువగా చూపించిందని కాగ్ నివేదిక పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మధ్య ఆస్తులు, అప్పుల పంపకంపై పురోగతి జరగలేదని తేల్చి చెప్పింది. విభజన ఆస్తుల పంపకాలపై తగినంత దృష్టి పెట్టలేదని తెలిపింది. రూ.1.18లక్షల కోట్ల రుణాలను బడ్జెట్‌లో పేర్కొనలేదని వెల్లడించింది. అప్పుల ద్వారానే రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రుణాలపై 2032-33 నాటికి రూ.2.52లక్షల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తుందని తెలిపింది.

DO WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment