Hyderabad: రూ.200 ల కోసం గొడవ..2 కోట్లు ఖర్చు పెట్టినా దక్కని ప్రాణాలు!

రూ. 200 కోసం గొడవపడ్డ క్యాబ్‌ డ్రైవర్‌ జీవితం గాల్లో కలిసిపోయింది.రెండేళ్ల క్రితం వివేక్‌ అనే వ్యక్తి క్యాబ్‌ ఛార్జీ 900 అయితే 700 ఇవ్వగా అతనితో డ్రైవర్‌ వెంకటేశ్‌ గొడవపడ్డాడు.దీంతో వివేక్‌ అతని ఫ్రెండ్స్‌ వెంకటేశ్‌ని చితకబాదగా..అతను రెండేళ్లు కోమాలో ఉండి ఆదివారం చనిపోయాడు.

New Update
Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

Hyderabad: కేవలం రూ.200ల కోసం మొదలైన చిన్న గొడవ ఓ యువకుడి జీవితాన్ని శాశ్వతంగా అంధకారంలోకి నెట్టేసింది. ఒక్కడిని చేసి 20 మంది కలిసి చితకబాదడంతో అతడు రెండు సంవత్సరాల పాటు మంచం మీదే ఉండి చికిత్స తీసుకుంటూ చనిపోయాడు.ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఉప్పర్‌ పల్లిలో జరిగింది.

రెండు సంవత్సరాల క్రితం అంటే 2022 జులై 31వ తేదీ.. రాత్రి 11 గంటలకు వివేక్‌రెడ్డి అనే వ్యక్తి.. నగరంలోని బీఎన్‌రెడ్డినగర్‌ నుంచి రాజేంద్రనగర్‌ సమీపంలోని ఉప్పర్‌పల్లికి క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాడు. తీరా గమ్యం చేరాక... ఛార్జీ రూ.900 అయ్యిందని క్యాబ్‌ డ్రైవర్‌ వెంకటేష్‌ గౌడ్‌ (27) చెప్పగా.. వివేక్‌రెడ్డి రూ.700 మాత్రమే ఇచ్చాడు. మిగిలిన రూ. 200 కోసం ఇద్దరి మద్య గొడవ మొదలైంది. దీంతో వివేక్‌రెడ్డి తన స్నేహితులకు ఫోన్‌ చేసి రప్పించాడు. సుమారు 20 మంది వరకు వచ్చి, వెంకటేశ్‌గౌడ్‌ను క్రికెట్‌ బ్యాట్లు, వికెట్లతో చితకబాది.. బంగారు గొలుసు చోరీ చేయబోయాడంటూ వెంకటేష్‌ను రాజేంద్రనగర్‌ పోలీసులకు అప్పగించారు.

ఆ మర్నాడు ఉదయం 6 గంటలకు వెంకటేష్‌ పరిస్థితి విషమించడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అక్కడికి తరలించిన కొద్దిసేపటికే బాధితుడు కోమాలోకి వెళ్లాడు. దీంతో ఆస్పత్రిలో రెండేళ్లుగా చికిత్స పొందుతూ వెంకటేశ్‌ గౌడ్‌ ఆదివారం మృతి చెందాడు.

Also read: యూట్యూబర్లకు కేంద్రం ఊహించని షాక్.. త్వరలో కొత్త చట్టం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Crime News: నాశనమైపోతార్రా.. 5 ఏళ్ల చిన్నారిని చంపి.. తల్లిపై మైనర్లు రేప్

హర్యానాలోని జింద్‌లో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతున్న బాధితురాలిపై నలుగురు దుండగులు దాడి చేశారు. అందులో 5ఏళ్ల చిన్నారిని చంపి చెత్తకుండీలో పడేశారు. ఆపై బాధితురాలిపై అత్యాచారం చేశారు. ఆమె స్పృహ కోల్పోవడంతో అక్కడ నుంచి పరారయ్యారు.

New Update
Rape and murder Haryana

Rape and murder Haryana

కామాంధుల ఆగడాలు పెరిగిపోయాయి. ఆడది కనిపిస్తే చెలరేగిపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా క్రూర మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటిదే ఓ దారుణం జరిగింది. ఇంట్లో తన ముగ్గురు బిడ్డలతో నిద్రిస్తున్న ఓ మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో 5 ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉండటం సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

5 ఏళ్ల చిన్నారిని చంపి

ఈ ఘటన హర్యానాలోని జీంద్‌లో జరిగింది. మంగళవారం రాత్రి ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో గుడిసెలో నిద్రిస్తుంది. దీంతో ఆమె భర్త లేడని తెలుసుకున్న నలుగురు దుండగులు ఆ గుడిసెలోకి వెళ్లారు. అనంతరం పిల్లలతో కలిసి నిద్రిస్తున్న బాధితురాలిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

అదే సమయంలో ఆ బాధితురాలితో పాటు 5 ఏళ్ల చిన్నారిని పక్కనే ఉన్న చెత్తకుప్ప వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆ చిన్నారి గొంతు నులిమి హత్య చేశారు. ఆపై బాధితురాలి పై దుండగులు నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఇక గొంతునులిమి హత్య చేసిన చిన్నారి.. డెడ్ బాడీ రాత్రంతా చెత్తకుప్పలోనే ఉంది. ఇక గురువారం ఆ బాధితురాలు స్పృహలోకి వచ్చి.. జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై ఎస్‌ఐ. యశ్‌వీర్ మాట్లాడుతూ.. ఇందులో నిందితుడు అమిత్‌ అనే వ్యక్తితో సహా మరో ముగ్గురు మైనర్లు ఉన్నారని వెల్లడించారు. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

telugu-news | crime news | Minor Girl Rape | latest-telugu-news | girl raped and murdered

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు