Forbes Billionaires List 2025: 3లక్షల కోట్లు ఆమె సొంతం.. దేశంలో అత్యంత సంపన్నురాలు ఎవరో తెలుసా..?

2025 ఫోర్బ్స్ బిలియ‌నీర్ల జాబితా రిలీసైంది. అందులో అత్యంత సంపన్నురాలుగా సావిత్రి జిందాల్ నిలిచారు. ఆమె ఆస్తుల విలువ 35.5 బిలియ‌న్ డాల‌ర్లు అంటే.. రూ.3 లక్షల 34 వేల కోట్లుగా చెప్పుకోవచ్చు. టాప్ 10 ఇండియ‌న్ బిలియ‌నీర్ల జాబితాలో ఆమె 3వ స్థానంలో ఉన్నారు.

New Update
Savitri Jindal

Savitri Jindal Photograph: (Savitri Jindal)

2025 ఫోర్బ్స్ బిలియ‌నీర్ల జాబితా రిలీజైంది. భార‌తీయ బిలియ‌నీర్ల మొత్తం ఆస్తుల విలువ 941 బిలియ‌న్ల డాల‌ర్లు. గ‌త ఏడాదితో పోలిస్తే ఇది త‌గ్గింది. ఆ లిస్టులో అత్యంత సంప‌న్న భార‌తీయ మ‌హిళ‌గా సావిత్రి జిందాల్ నిలిచారు. అంతేకాదు ఆమె హ‌ర్యానాలో ఎమ్మెల్యేగా కూడా కొన‌సాగుతున్నారు. టాప్ టెన్ ఇండియ‌న్ బిలియ‌నీర్ల జాబితాలో ఆమె మూడ‌వ స్థానంలో ఉన్నారు. ఓపీ జిందాల్ గ్రూపు ఓన‌ర్‌గా ప్రస్తుతం సావిత్రి జిందాల్ ఉన్నారు. 2025 ఫోర్బ్స్ బిలియ‌నీర్స్ లిస్ట్‌లో ఈమె రిచెస్ట్ ఇండియ‌న్ ఉమెన్‌గా నిలిచారు. ఆమె ఆస్తుల విలువ‌ సుమారు 35.5 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉన్నట్లు ఆ జాబితాలో వెల్లడించారు. ముకేశ్ అంబానీ, గౌతం అదానీ త‌ర్వాత ఆ జాబితాలో సావిత్రి మూడ‌వ స్థానంలో ఉన్నారు. టాప్ 10 భార‌త బిలియ‌నీర్ల‌లో ఉన్న ఏకైక మ‌హిళ ఆమే కావ‌డం విశేషం.

Also read: Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..?

 35.5 బిలియ‌న్ డాల‌ర్లు అంటే.. మన ఇండియన్ కరెన్సీలో 3లక్షల కోట్ల 34 వేల కోట్లు ఆమె పేరు మీద మొత్తం ఆస్తులు ఉన్నాయి. స్టీల్, ప‌వ‌ర్‌, సిమెట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో జిందాల్ గ్రూపు బిజినెస్ చేస్తోంది. ఆ గ్రూపున‌కు సావిత్రి చైర్మెన్‌గా కొన‌సాగుతున్నారు. ఆమె భ‌ర్త ఓం ప్రకాశ్ జిందాల్ ఆ కంపెనీ స్థాపించారు. 2005లో జ‌రిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఓపీ జిందాల్ ప్రాణాలు కోల్పోయారు. ఆయ‌న మృతి త‌ర్వాత వ్యాపారాన్ని నాలుగురు కుమారుల‌కు విభ‌జించారు. ముంబైలో స‌జ్జన్ జిందాల్, ఢిల్లీలో నివ‌సించే న‌వీన్ జిందాల్‌, మరో ఇద్దరు కొడుకులు ఉన్నారు.

Also read: PM Modi: ‘మరో 5 నెలల్లో ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. తర్వాత ఎవరో RSS నిర్ణయం’

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Amazon Great Summer Sale: అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు నుంచే సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఇవ్వనుంది.

New Update
Amazon great summer sale

Amazon great summer sale

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ను ప్రకటించింది. వచ్చే నెల మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సమ్మర్ సేల్ ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు నుంచే సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఇవ్వనుంది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

5 శాతం వరకు డిస్కౌంట్..

ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్లుకు 10 శాతం డిస్కౌంట్‌ కూడా ఇస్తోంది. దీంతో పాటు క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై కూడా డిస్కౌంట్‌ లభించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుదారులకు అయితే 5 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. వీటితో పాటు క్యాష్‌బ్యాక్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్స్‌, నో-కాస్ట్‌ ఈఎంఐ వంటివి కూడా ఈ సేల్ ద్వారా ఉన్నాయి.

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో భాగంగా.. కొన్ని స్మార్ట్‌ఫోన్లపై భారీగా డిస్కౌంట్‌లను ఇవ్వనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 అల్ట్రా, ఐక్యూ నియో 10R, ఐఫోన్ 15, వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 లైట్, వన్ ప్లస్ 13ఆర్,  గెలాక్సీ ఎమ్ 35 5జీ, వన్ ప్లస్ నోర్డ్ 4, ఐక్యూ జెడ్ 10ఎక్స్ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌ ఇవ్వనుంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

వీటితో పాటు ల్యాప్‌టాప్‌లపై కూడా ఆఫర్లను ప్రకటించనుంది. హెచ్‌పీ, లెనోవా వంటి వాటిపై కూడా ఆఫర్లు ఇవ్వనుంది. వీటితో పాటు స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు ఇతర వాటిపై కూడా ఆఫర్లు ఇవ్వనుంది. పొందగలుగుతారు, దీని వలన మీ కొనుగోళ్లు మరింత సరసమైనవిగా మారుతాయి.

 

mobiles | amazon-great-summer-sale | discounts | laptops

Advertisment
Advertisment
Advertisment