/rtv/media/media_files/2026/04/01/digital-2026-04-01-19-50-46.jpg)
డిజిటల్ లావాదేవీలలో మోసాలను అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకున్న కీలక నిర్ణయం నేటి నుండి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం, పాపులర్ యూపీఐ (UPI) ప్లాట్ఫామ్లతో సహా అన్ని రకాల డిజిటల్ చెల్లింపులకు 'టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్' (2FA) తప్పనిసరి అయింది. ఈ కొత్త నిబంధన వల్ల వినియోగదారులు తమ లావాదేవీలను పూర్తి చేయడానికి రెండు దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఎవరైనా మీ పిన్ (PIN) నంబర్ను చూసినా లేదా తెలుసుకున్నా, మీ అనుమతి లేకుండా అనధికారికంగా డబ్బులు డ్రా చేయడం సాధ్యపడదు.
రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం, ఇండియాలోని అన్ని డిజిటల్ చెల్లింపులు తప్పనిసరిగా ఈ రెండు దశల భద్రతా ప్రమాణాలను పాటించాలి. ప్రస్తుతం మన దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ప్రధానంగా ఎస్ఎమ్ఎస్ (SMS) ద్వారా వచ్చే వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)ని రెండవ భద్రతా అంశంగా వాడుతోంది. బ్యాంకులు,ఇతర ఆర్థిక సంస్థలన్నీ ఏప్రిల్ 1 నాటికి ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆర్బీఐ గతంలోనే ఆదేశించింది. బ్యాంకు మోసాలను తగ్గించి, బాధ్యతాయుతమైన చెల్లింపుల వ్యవస్థను నిర్మించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
పిన్ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోదు
ఈ రోజు నుండి యూపీఐ ద్వారా డబ్బులు పంపేటప్పుడు కేవలం పిన్ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోదు. ఆ లావాదేవీని ధృవీకరించడానికి ఓటీపీ ఎంటర్ చేయడం లేదా ఫింగర్ప్రింట్, ఫేషియల్ రికగ్నిషన్ వంటి బయోమెట్రిక్ పద్ధతులను ఉపయోగించడం తప్పనిసరి. వీటితో పాటు భద్రతను మరింత పెంచడానికి బ్యాంకింగ్ యాప్లలో స్క్రీన్ షాట్లు తీయడం లేదా స్క్రీన్ రికార్డింగ్ చేయడంపై పూర్తి నిషేధం విధించారు. దీనివల్ల వినియోగదారుల డేటా ఇతరుల చేతికి చిక్కకుండా రక్షణ లభిస్తుంది.
అయితే, ఈ అదనపు భద్రతా ప్రక్రియ వల్ల లావాదేవీ పూర్తి కావడానికి కొన్ని సెకన్ల సమయం అదనంగా పట్టే అవకాశం ఉంది. దీనిపై బ్యూరో సంస్థ డైరెక్టర్ అనిల్ తడిమేటి మాట్లాడుతూ.. యూపీఐ లాంటి వేగవంతమైన వ్యవస్థలో మోసాలను అడ్డుకోవాలంటే లావాదేవీ పూర్తయ్యేలోపే చర్యలు తీసుకోవడం ముఖ్యమని తెలిపారు. వినియోగదారుల గుర్తింపును రియల్ టైమ్లో సరిచూడటం ద్వారా మరింత నమ్మకమైన చెల్లింపుల వాతావరణం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Follow Us