Accident : ఘోర ప్రమాదం..లోయలో పడిన బస్సు..70 మంది ప్రయాణికులు! గుజరాత్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సపుతారాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. సూరత్ నుంచి వస్తున్న లగ్జరీ బస్సు సపుతర ఘాట్ సమీపంలోని లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. By Bhavana 08 Jul 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Gujarat : గుజరాత్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సపుతారా (Saputara) లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. సూరత్ నుంచి వస్తున్న లగ్జరీ బస్సు సపుతర ఘాట్ సమీపంలోని లోతైన లోయ (Vally) లో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ప్రమాదం (Bus Accident) జరిగిన సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే సపుతర పోలీసులు, 108 బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించేందుకు చర్యలు ప్రారంభించారు. బస్సు ఆదివారం సూరత్ (Surat) చౌక్ మార్కెట్ నుంచి సపుతరకు పర్యాటకులతో బయల్దేరి..తిరిగి సూరత్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ఓ వాహనాన్ని ఓవర్ టెక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న టెంపోను తప్పించే క్రమంలో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో అక్కడే ఉన్న గోడను ఢీకొని లోయలో పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం తరలించేందుకు సహాయక చర్యలు సాగుతున్నాయి. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also read: ఫిర్యాదులు నిజమని తేలితే మళ్ళీ పరీక్ష-ఎన్టీయే #gujarat #bus-accident #vallay #surat సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి