Gujarath: గుజరాత్‌లో కూలిన భవనం..చిక్కుకున్న 15 మంది

గుజరాత్‌లోని సూరత్‌లో 5 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోవడంతో దీని కింద 15మంది చిక్కుకుపోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

New Update
Gujarath: గుజరాత్‌లో కూలిన భవనం..చిక్కుకున్న 15 మంది

Building Collapsed: ఈరోజు మధ్యాహ్నం 3గంటల సమయంలో సూరత్‌లోని సచిన్ అనే ప్రాంతంలో మనుషులు ఉంటున్న ఐదు అంతస్తుల భవనం కూలిపోయింది. 2017లో ఈ నిర్మించిన ఈ బిల్డింగ్‌లో 30 ప్లాట్లు ఉన్నాయి. వాటిలో ఆరు కుటుంబాలు నివసిస్తున్నాయి. భవనం పడిపోయిన సమయంలో అందరూ అందులోనే ఉన్నారు. దీనివల్ల భవనం శిథిలాల కింద 15మంది చిక్కుకుపోయారు.

భవనం కూలిన ఐదు నిమిషాల తర్వాత పోలీసులకు సమాచారం వచ్చిందని సూరత్ పోలీసు కమిషనరల్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ తెలిపారు. వెంటనే సీనియర్ అధికారులు, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక మహిళను అగ్నిమాపక సిబ్బంది రక్షించింది. మిగతావారిని ఇంకా కాపాడవలసి ఉంది.

Also Read:National: ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక

Advertisment
Advertisment
తాజా కథనాలు