KCR: వారికి సాయం చేయండి.. రేవంత్ సర్కార్ ను ప్రస్తావిస్తూ కేసీఆర్ తొలి ప్రకటన!

ఈ రోజు నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

New Update
KCR: వారికి సాయం చేయండి.. రేవంత్ సర్కార్ ను ప్రస్తావిస్తూ కేసీఆర్ తొలి ప్రకటన!

నల్లగొండ జిల్లాలో ఈ రోజు జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్పందించారు. ఈ ప్రమాదాలపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కేసీఆర్ కోరారు.

ఈ మేరకు కొద్ది సేపటి క్రితం కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడలేదు. ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఈ రోజు తొలిసారిగా ఆయన రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రకటన విడుదల చేశారు.

ఈ వార్త అప్డేట్ అవుతోంది..

Advertisment
Advertisment
తాజా కథనాలు