National : ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట.. నిర్దోషి అని ప్రకటించిన బాంబే హైకోర్టు

మావోయిస్టుల సంబంధాలున్నాయంటూ అరెస్ట్ చేసిన ప్రొఫెసర్ సాయిబాబాకు ఎట్టకేలకు ఊరట లభించింది. బాంబే హైకోర్టు ఆయన నిర్దోషి అని ప్రకటించింది. 2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
National : ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట.. నిర్దోషి అని ప్రకటించిన బాంబే హైకోర్టు

Professor Sai Baba : పదేళ్ళ తర్వాత ప్రోషెసర్ సాయిబాబా(Professor Sai Baba) కు జైలు నుంచి విముక్తి లభించింది. ఇన్నాళ్ళ తర్వాత బాంబే హైకోర్టు(Bombay High Court) ఆయనను నిర్దోషి అని ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ... 2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు(Maharashtra Police) అరెస్ట్ చేశారు. ఈ కేసులో 2017లో గడ్జిరౌలీ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. 2014 నుంచి ప్రొఫెసర్ సాయిబాబా నాగ్‌పూర్‌ జైల్లోనే ఉంటున్నారు.
Also Read : Andhra Pradesh: వైసీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం గుడ్‌బై..

అప్పట్లో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని.. ఫ్రోఫెసర్ సాయిబాబాతో పాటు ఐదుగురిపై UAPA కేసులు పెట్టింది. ఇప్పుడు ఈ ఉపా కేసులన్నింటినీ నాగపూర్‌ ధర్మాసనం కొట్టివేసింది. ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

2014లో అరెస్ట్ అయ్యేనాటికి ప్రొఫెసనర్ సాయిబాబా ఢిల్లీ యూనివర్శిటీ(Delhi University) లో జాబ్ చేస్తున్నారు. కేసు నేపథ్యంలో 2014లోనే ఆయనను యూనివర్శిటీ నుంచి సస్పెండ్ చేశారు. 2021లో విధుల్లోంచి తొలగించారు. చిన్నప్పటి నుంచే 90 శాతం వైకల్యంతో సాయిబాబా బాధపడుతున్నారు. జైల్లో పెట్టిన తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. పలుసార్లు ఆయనకు వైద్యులు చికిత్స కూడా అందించారు. ఎట్టకేలకు సాయిబాబాకు జైలు నుంచి శాశ్వత విముక్తి అభించింది.

Also Read : Samantha : ఐకాన్‌ స్టార్‌ను తెగ పొగిడేస్తున్న సామ్.. మతలబేంటో తెలుసా!

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి

హైదరాబాద్  సన్ రైజర్స్ ఇంక ఇంటికి వెళ్ళిపోయినట్లే. ఈరోజు కూడా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి వరుసగా నాలుసార్లు ఓటమిని చవి చూసింది. ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్ మ్యాచ్ ను పోగొట్టుకుంది. 

New Update
ipl

GT VS SRH

సొంత గ్రౌండ్ లో హైదరాబాద్ మళ్ళీ ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ ఇచ్చిన 153 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 16.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది.  గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ 61 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 49 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్స్ లో షమీ 2, రమిన్స్ ఒక వికెట్ తీశారు.  

గుజరాత్ బౌలర్లు తాట తీశారు..

అంతకు ముందు ఉప్పల్ స్డేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ ను గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ దారుణంగా దెబ్బకొట్టాడు. నాలుగు ఓవర్లలో  కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు తీశాడు.  ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18) లను మొదట్లోనే  వెనక్కి పంపిన సిరాజ్.. డేంజరెస్ ఆటగాడు అనికెత్ వర్మ(18) ను ఎల్బీగా వెనక్కి పంపించాడు. సన్‌రైజర్స్ ఆటగాళ్లలో నితీష్ కుమార్ రెడ్డి(31), హెన్రిచ్ క్లాసెన్(27), పాట్ కమ్మిన్స్ (22) పరుగులు చేశారు.  గుజరాత్ బౌలర్ లో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ చెరో రెండు వికెట్లు తీశారు.  

today-latest-news-in-telugu | IPL 2025 | gt-vs-srh 

Also Read: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త

Advertisment
Advertisment
Advertisment