Bomb Threat: ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు..ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!

ముంబయి విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో తిరువనంతపురం విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలెర్ట్‌ ను ప్రకటించారు.

New Update
Vijayawada : బెజవాడ వాసులకు శుభవార్త!

Bomb Threat: ముంబయి నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో గురువారం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలెర్ట్‌ ను ప్రకటించారు. విమానం ఉదయం 8 గంటలకు ల్యాండ్ అవ్వగా..దానిని ఐసోలేషన్‌ బే కి తరలించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

విమానం నుంచి ప్రయాణికులను ఖాళీ చేయిస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానం తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకోగానే పైలట్‌ కి బాంబు బెదిరింపు సమాచారం వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విమానంలో సుమారు 135 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.

Also Read: మెగాస్టార్‌ బర్త్‌ డే స్పెషల్‌.. అర్థరాత్రి ”విశ్వంభర” అదిరిపోయే ట్రీట్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: ఏపీలో దారుణం.. టీడీపీ నేతను నరికి నరికి

ఒంగోలులో మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందారు.

author-image
By B Aravind
New Update

ఒంగోలులో దారుణం జరిగింది. మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. పద్మ టవర్స్‌లోని తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. ఆ తర్వాత స్థానికులు వీరయ్యను సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లిక్కర్‌ సిండికేట్‌ విషయంలో గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

Also Read: ముంబై నుంచి హీరోయిన్‌ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?

 

Advertisment
Advertisment
Advertisment