America: సాయం కోసం ఫోన్‌ చేస్తే ఆమెనే కాల్చి చంపిన పోలీసులు!

అమెరికాలో 911 కు కాల్‌ చేసి తనకు రక్షణ కావాలని కోరిన మహిళనే పోలీసులు కాల్చి చంపారు. దీంతో మృతురాలి తల్లిదండ్రులు న్యాయపోరాటానికి దిగారు.

New Update
America: సాయం కోసం ఫోన్‌ చేస్తే ఆమెనే కాల్చి చంపిన పోలీసులు!

అమెరికాలోని లాన్ కాస్టర్‌ లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. సాయం కోసం పోలీసులకు ఫోన్‌ చేసిన మహిళనే పోలీసులు కాల్చి చంపారు. ఈ దారుణ ఘటనలో చనిపోయిన మహిళ ఓ నల్లజాతీయురాలు కావడంతో లాన్‌కాస్టర్‌ లో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఈ కేసులో మరో ట్విస్టు ఏంటంటే..ఇప్పుడు ఈ మహిళను కాల్చిన పోలీసు ఆఫీసర్‌ కి గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ వ్యక్తిని కాల్చి చంపిన రికార్డు ఉంది.

ఈ ఘటన డిసెంబర్‌ 4 వ తేదీన జరగగా బాధితురాలి తల్లిదండ్రులు న్యాయపోరాటానికి దిగారు. అసలేం జరిగిందంటే..లాస్‌ ఏంజెల్స్‌ లాన్‌ కాస్టర్‌ లో నియాని ఫిన్లేసన్‌ (27) చాలా కాలం నుంచి తన ఇద్దరు కూతుళ్లతో ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె మాజీ ప్రియుడు ఆమె ఇంటికి వచ్చి గొడవ పడ్డాడు. దీంతో ఆమె సాయం కోసం పోలీసులకు 911కి కాల్‌ చేసింది.

గృహ హింస పై రిపోర్ట్‌ చేసి తనకు రక్షణగా పోలీసులను పంపాలని కోరింది. అయితే పోలీసులు అక్కడికి వెళ్లేసరికి నియాని చేతిలో 8 అంగుళాల కత్తి ఉందని..నియాని తన మాజీ ప్రియుడ్ని చంపడానికి ప్రయత్నించిందని పోలీసులు వివరించారు. ఈ క్రమంలో ఆమెను చాలాసార్లు కత్తి కింద పడేయాలని అడిగినప్పటికీ కూడా ఆమె మాట వినకపోవడం వల్లే ఆమె పై కాల్పులు జరిపినట్లు పోలీసుల వివరించారు.

బుల్లెట్‌ గాయాలతో నియాని కిందపడిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె చనిపోయినట్లు తెలిపారని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసు కోసం నియాని ఇంటికి వెళ్లిన పోలీసుల్లో టీవై షెట్లన్‌ అనే అధికారి కూడా ఉన్నారు. ఆయన మూడు సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ వ్యక్తిని కాల్చి చంపారు.

దీంతో తాజాగా జరిగిన ఘటన పై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో నియాని 9 ఏళ్ల కూతురు పోలీసులు చెబుతున్న దానిలో నిజాలు లేవని తెలిపింది. కావాలనే పోలీసులు తన తల్లి పై కాల్పులు జరిపారని, ఆమె కిందపడిపోయిన తరువాత నేను అమ్మ కోసం ఏడుస్తుంటే తనని ఓదార్చారని వివరించింది.

దీంతో నియాని తల్లిదండ్రులు తమ కూతురు మరణం వెనుకు నిజాలు వెలికితీయాలంటూ న్యాయపోరాటానికి దిగారు. తమ కూతురును చంపిన పోలీసు అధికారిని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also read: ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఉపాసన, రామ్‌ చరణ్‌..టాలీవుడ్‌ ఫస్ట్‌ కపుల్‌ గా ఘనత!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?

దుబాయ్ నుంచి వచ్చిన భర్తను ప్రియుడితో కలిసి భార్య రజియా చంపేసింది. బాడీని ముక్కలు చేసి భర్త తెచ్చిన బ్యాగ్‌లోనే ప్యాక్ చేసి ఊరికి 55KM దూరంలో పడేశారు. ఎయిర్‌పోర్ట్‌లో QRకోడ్‌ స్టికర్ బ్యాగ్‌పై ఉంది. దానితోనే పోలీసులు కేసు చేధించారు. వారిని అరెస్ట్ చేశారు.

New Update
Uttar Pradesh Deoria

Uttar Pradesh Deoria

విదేశాల నుంచి తిరిగొచ్చిన భర్తను భార్య చంపి ముక్కలు ముక్కలు చేసింది. చివరికి అతను తెచ్చిన బ్యాగ్‌లో ప్యాక్ చేసి 55 కిలో మీటర్ల దూరంలో వేసింది. ఎంత పెద్ద క్రైమ్ చేసిన ఏదో ఓ చిన్న తప్పుతో దొరికిపోతారనే పోలీసుల మాట నిజమైంది. రజియా తన అక్రమ సంబంధానికి కొనసాగించేందుకు భర్త అడ్డు తొలగించుకోవాలని చూసింది. పక్కా ప్లాన్‌తో లవర్, అతని మేనల్లుడితో కలిసి భర్త నౌషాద్ అహ్మద్‌‌ను చంపి సూట్‌కేస్‌లో పెట్టింది. దాన్ని ఊరికి 55 కిలో మీటర్ల దూరంలో పడేశారు.

Also read: Woman kills husband: భర్తకు ఛాయ్‌లో ఎలుకల మందు.. పింటూతో నలుగురు పిల్లల తల్లి లవ్ ట్రాక్

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఇది చోటుచేసుకుంది. పది రోజుల క్రితం దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తిని అతని భార్య, ఆమె లవర్ హత్య చేశారు. బాధితుడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేశారు. దాన్ని ఇంటి నుండి 55 కిలోమీటర్ల దూరంలో పడేశారు. తార్కుల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్ఖౌలి గ్రామంలో ఏప్రిల్ 21న తన పొలంలో అనుమానాస్పద బ్యాగ్ చూసి రైతు జితేంద్ర గిరి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి బ్యాగ్‌ తెరిచి చూస్తే.. ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టిన మొండెం, కాళ్ల కనిపించాయి. తలపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు ఉంది. మృతదేహం గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. ఆ బ్యాగ్‌కు ఒక క్యూర్ కోడ్ ఉంది. అది ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ చెక్కింగ్ సమయంలో వేసింది. ఈ క్యూఆర్ కోడ్‌తో పోలీసులు కేసు ఛేదించారు. 

Also read: ACB caught: అడ్డంగా బుక్కైన మణుగూరు CI.. ఏసీబీకి ఎలా దొరికాడంటే?

విమానాశ్రయ అధికారులతో బార్‌కోడ్‌ను ట్రాక్ చేస్తే మృతుడు మెయిల్ పోలీస్ స్టేషన్‌లోని భటౌలి గ్రామానికి చెందిన నౌషాద్ అహ్మద్‌(38)గా గుర్తించారు. పోలీసులు అతని ఇంటికి వెళ్లినప్పుడు భార్య పోలీసుల ముందే భర్త కనిపించడం లేదని ఏడ్చింది. పోలీసులు ఇంట్లో వెతికగా.. రక్తపు మరకలతో ఉన్న మరో సూట్‌కేస్ దొరికింది. ఆమె ఆస్కార్ ఫర్మామెన్స్‌పై పోలీసులకు అనుమానం వచ్చి వారి స్టైల్లో విచారించారు. దీంతో రజియా, ఆమె ప్రేమికుడితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. భర్తకు స్కెచ్ వేసిన రజియా అతను దుబాయ్ నుంచి తెచ్చిన అదే బ్యాగ్‌ వాడి దొరికిపోయింది. ఆమె మేనల్లుడు రుమాన్‌లో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వస్తు్న్నాడని హత్య చేసినట్లు పోలీసుల విచారణ తేలింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అసలు ఏం అయ్యింది ఈ భార్యలకు.. మానవ విలువలు మట్టికలిసిపోతున్నాయా? నెల వ్యవధిలోనే ఇది ఐదో హత్య. మీరట్‌లో సౌరభ్, అమిత్ కశ్యప్, బరేలీలో కేహర్ సింగ్, హర్యానాలో ప్రవీణ్.. ఇప్పుడు నౌషాద్ అహ్మద్‌. వీరంతా భార్యల  వివాహేతర సంబంధానికి బలైన బాధితులు. ఈ వార్తలు విని పెళ్లీడుకు వచ్చిన యువకులు వివాహం చేసుకోవాలంటే భయంతో వణుకుతున్నారు. బతికుంటే జీవితాంతం.. ఇలా సింగిల్‌గానైనా ఉండొచ్చని అనుకుంటున్నారు.

Also read: Hydrogen Bomb: ప్రపంచానికి మరో విధ్వంసాన్ని పరిచయం చేసిన చైనా

(latest-telugu-news | crime news | wife cuts husband dead body)

 

 

Advertisment
Advertisment
Advertisment