MISSING CASE: పవన్కు జీవితాంతం రుణపడి ఉంటా.. బాలిక తల్లి భావోద్వేగం! 9 నెలలుగా మిస్సైన బిడ్డను ఇంటికి చేర్చిన పవన్ కల్యాన్ కు జీవితాంతం రుణపడి ఉంటానని బాధితురాలు తల్లి శివకుమారి చెప్పారు. పవన్, పోలీసులకు ధన్యవాదాలు. నా బిడ్డతో కలిసి పవన్ ను కలుస్తా. నాలాంటి తల్లుల బాధలు కూడా తీర్చండి' అని కోరింది. By srinivas 03 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Bhimavaram: తన బిడ్డను ఇంటికి రప్పించిన డిప్యూటీ సిఎం పవన్ కల్యాన్ కు జీవితాంతం రుణపడి ఉంటానని బాధితురాలు తల్లి శివకుమారి అన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన శివకుమారి.. 'నా కుమార్తె తిరిగి నా దగ్గరకు వస్తుందని అనుకోలేదు. పవన్ చొరవ వల్లే ఇదంతా జరిగింది. తల్లిగా నా వేదన పవన్ తీర్చారు. నా కూతురు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అసలు నా కుమార్తె బతికి ఉందో లేదో కూడా తెలియలేదు. ఎవరికి చెప్పుకోలేక పోయాను. నేను పవన్ ను కలిసి నా బాధ చెబితే ఆయన స్పందించారు. నేను మళ్ళీ నా బిడ్డతో కలిసి పవన్ ను కలుస్తానని చెప్పింది. అలాగే'పోలీసులు కూడా చాలా కష్టపడి పనిచేసి నా బిడ్డను నాకు అప్పగించారు. నా బిడ్డను చంపేసేవాడు ఆ దుర్మార్గుడు. పవన్, పోలీసులకు ధన్యవాదాలు. పోలీసులు స్పందించక పోతే ఇదంతా జరిగేది కాదు. నాకు మాదిరిగానే చాలా మంది తల్లులు ఇలానే చెప్పుకోలేని బాధలో ఉన్నారు. వారి విషయంలో కూడా ఇలానే చేయాలని కోరుతున్నా' అంటూ శివకుమారి కన్నీరుపెట్టుకుంది. #pawan-kalyan #bimavaram-missing-case #sivakumari సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి