Bike Racing: అయ్యో.. మీ ఒళ్ళు కొవ్వుతో అమాయకుడ్ని చంపేశారు కదరా!

బైక్ రేసింగ్ ఒక అమాయకుడి ప్రాణం తీసింది. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఒక వ్యక్తిని బైక్ రేసింగ్ చేస్తూ వేగంగా వచ్చిన బైకిస్ట్ ఢీ కొట్టాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చూడండి.

New Update
Bike Racing: అయ్యో.. మీ ఒళ్ళు కొవ్వుతో అమాయకుడ్ని చంపేశారు కదరా!

Common Man Died in Bike Racing: ఒక్కోసారి ఒళ్ళుజలదరించే వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. వాటిని చూస్తే అయ్య బాబోయ్ అనిపిస్తుంది. తరువాత ఆ వీడియో వివరాలు పూర్తిగా తెలిస్తే.. అందులో బాధితుల మీద జాలి.. ఆ సంఘటనకు కారకులైనవారిని చూసి పీక నులిమి చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఇప్పుడు మీకో వీడియో ఇక్కడ చూపిస్తున్నాం చూడండి..

చూశారు కదా.. ఏమనిపిస్తోంది? అయ్యో.. కుర్రకారు.. అనిపిస్తోంది కదా. బైక్ రైడింగ్(Bike Racing) తో ప్రాణాలు తీసుకుంటున్నారు అని బాధ కలుగుతుంది కదా. ఈ వీడియో ఈ మధ్య కాలంలో వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా ట్రెండింగ్ అవుతూ.. షేర్ అవుతోంది. ఈ వీడియో షేర్ చేసిన వారంతా.. ‘’ఇంతటి మెరుపు వేగం ఎందుకు? నేటి తరం యువత వారి జీవితాన్ని ఎలా అంధకారం, నిర్వీర్యుడై పోతున్న యువత...!? మీ పిల్లలు ఏమి చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. స్పోర్ట్స్ బైక్.. రైడింగ్ అవసరమా? భారతీయ రోడ్డు పై సాధ్యమా? ఆలోచన చేయండి. యువతను గమనిస్తూ ఉండండి’’ ఇలాంటి కామెంట్స్ తో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

ముందు ఈ వీడియో చూసి మేమూ అలానే అనుకున్నాం. మన దేశంలో రోడ్లపైన ఇలాంటి ఫీట్స్(Bike Racing) ఏమిటి? అని. కానీ, ఈ వీడియో ఎక్కడిదో తెలుసుకోవడం కోసం గూగుల్ లో రీసెర్చ్ చేశాం. అప్పుడు తెలిసింది ఈ వీడియో మన దేశంలోనిది కాదని. ఇండోనేషియా (Indonesia) దేశంలో జరిగిన ఘటన అని. సరే వీడియో ఏ దేశానికి చెందినది అయినా.. మన కుర్రకారు కూడా తప్పకుండ ఈ వీడియో గురించి తెలుసుకోవాల్సిందే అనిపించింది అందుకే ఈ కథనం.
ఇండోనేషియాలో ఒక వ్యక్తి తన విధులు ముగించుకుని రాత్రి సమయంలో ఇంటికి వెళుతున్నాడు. అదే సమయంలో ఆ రోడ్డుపై కొంతమంది కుర్రాళ్ళు బైక్ రేస్ చేస్తున్నారు. ఇంటికి వెళుతున్న వ్యక్తి మామూలు స్పీడులోనే వెళుతున్నాడు. ఈలోపు బైక్ రేస్ చేస్తూ వస్తున్న కుర్రాడు ఒకడు రాంగ్ సైడ్ లో అత్యంత వేగంగా వచ్చి ఆ వ్యక్తి బైక్ ని నేరుగా ఢీ కొట్టాడు. దీంతో బైక్  మీద నుంచి ఆ వ్యక్తి ఎగిరిపడి దాదాపు 100 మీటర్ల దూరం రోడ్డుమీద జారుకుంటూ పక్కనే ఉన్న రైలింగ్ కి గుద్దుకుని తలపగిలి అక్కడికక్కడే మరణించాడు. ఇదీ మీరు చూసిన ఈ వీడియో.

Also Read: ఎరక్కపోయి.. ఇరుక్కుపోయిన చిరుత.. ఎలా రక్షించారంటే.. 

చూశారా.. ఒళ్ళు కొవ్వెక్కి బైక్  పందేలు వేసుకున్న వారి వలన ఓ అమాయక ప్రాణం ఎలా పోయిందో. అంతా చేసి ఇది కేవలం 15 సెకన్ల వీడియో. కానీ చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తుంది. చనిపోయిన వ్యక్తిని చూస్తే జాలేస్తుంది. మనదేశంలోనూ ఇలా ఓవర్ స్పీడ్ తో దూసుకుపోయే కుర్రాళ్ళు.. ఆ సరదా ఎక్కువగా ఉన్న యువత చాలామంది ఉన్నారు. వారికి ఇటువంటి వీడియో చూస్తేనైనా కాస్త తగ్గుతారనిపిస్తుంది.
ఇక్కడ రెండు అంశాలు మనం చెప్పుకోవాలి. ఒకటి.. బైక్ రేసులతో వేగంగా వెళ్లడం వల్ల అనుకోని ప్రమాదం జరిగితే వారి తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది? ఒకవేళ వీడియోలో చూసినట్టు వేరేవారి ప్రాణం పొతే అప్పుడు పరిస్థితి ఏమిటి. పోయిన ప్రాణంతో పాటు దానికి కారణమైన వారి జీవితం కూడా జైలులో శిధిలం అయిపోతుంది కదా. అందుకే ఓవర్ స్పీడ్ వద్దు.. అంతేకాదు రోడ్డుపై డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఇక్కడ ఆ వీడియో ఒరిజినల్ లింక్ ఉంది మీరూ చూసేయండి..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bharat Bhushan: మూడేళ్ల చిన్నారి ఉందన్న వదల్లేదు.. మూడు నిమిషాలు పాటు కాల్చి కాల్చి!

ఉగ్రదాడిలో 35 ఏళ్ల భరత్ భూషణ్ తన ప్రాణాలు కోల్పోయాడు. తనకు మూడేళ్ల చిన్నారి ఉన్నందున విడిచిపెట్టాలని భరత్‌ భూషణ్‌ వారిని కోరినా పట్టించుకోకుండా తన భర్తను మూడు నిమిషాల పాటు అతి దారుణంగా  కాల్చేశాడని భరత్ భార్య సుజాత వాపోయింది.  

New Update
 Bharat Bhushan

Bharat Bhushan

పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బాధితులు కాళ్లు పట్టుకుని, చేతులెత్తి దండం పెట్టిన వదల్లేదు. ఈ ఉగ్రదాడిలో 35 ఏళ్ల భరత్ భూషణ్ తన ప్రాణాలు  కోల్పోయాడు. అందరినీ కాల్చేస్తూ ఓ ఉగ్రవాది తమ వద్దకు రాగా.. తనకు మూడేళ్ల చిన్నారి ఉన్నందున విడిచిపెట్టాలని భరత్‌ భూషణ్‌ వారిని కోరినా పట్టించుకోకుండా తన భర్తను మూడు నిమిషాల పాటు అతి దారుణంగా  కాల్చేశాడని భరత్ భార్య సుజాత వాపోయింది.  

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

దయచేసి నన్ను వదిలేయండి

భరత్ భూషణ్ భార్య సుజాత భూషణ్ ప్రముఖ డాక్టర్. ఈ దంపతులకు మూడేళ్ల చిన్నారి ఉంది. బెంగళూరులో స్థిరపడిన వీరంతా 2025 ఏప్రిల్ 18న విహారయాత్ర కోసమని కశ్మీర్ వెళ్లారు. ఏప్రిల్ 23న బెంగళూరుకు తిరిగి వెళ్లాల్సి ఉండగా.. మంగళవారం మధ్యాహ్నం పహల్గాం సమీప ప్రాంతానికి వెళ్లి అక్కడ సరదాగా తమ చిన్నారితో గడిపారు.  అప్పుడు అకస్మాత్తుగా  కాల్పలు శబ్ధాలు రావడంతో వెంటనే  ముగ్గురం పక్కనే ఉన్న గుడారాల వెనుక దాక్కున్నారు. ఇది గమనించిన ఓ ఉగ్రవాది తమ దగ్గరికి వచ్చాడని సుజాత తెలిపారు. తన  భర్త ఆ ఉగ్రవాదిని ‘‘నాకు ఒక బిడ్డ ఉంది. దయచేసి నన్ను వదిలేయండి’ అని అడిగాడు. అయినప్పటికీ ఆ ఉగ్రవాది కనికరించలేదు. తన భర్త తలపై కాల్చి చంపి వెళ్లిపోయాడంటూ సుజాత కన్నీటి పర్యాంతమైంది.  

Also Read : ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

పహల్గామ్ దాడి జమ్మూ కాశ్మీర్‌లో ఆరు సంవత్సరాలలో జరిగిన అత్యంత దారుణమైనది, 2019 ఫిబ్రవరిలో పుల్వామా జిల్లాలో 40 మంది సైనికులు హత్యకు గురైన తర్వాత ఇదే అత్యంత దారుణమైనది. అమాయకపు టూరిస్టులపై దాడులకు పాల్పడిన ఏ ఒక్క డగ్రవాదిని కూడా వదిలిపెట్టబోమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

Advertisment
Advertisment
Advertisment