Heatwave: తెరుచుకున్న పాఠశాలలు.. ఎండకు సొమ్మసిల్లిపోయిన విద్యార్థులు

బీహార్‌లో వేసవి సెలవులు ముగియడంతో ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే షేక్‌పూరా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో ఎండ వేడికి తట్టుకోలేక 16 మంది విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు. టీచర్లు వారిని ఆసుపత్రికి తరలించారు.

New Update
Heatwave: తెరుచుకున్న పాఠశాలలు.. ఎండకు సొమ్మసిల్లిపోయిన విద్యార్థులు

ఓవైపు వేసవి కాలం ముగిసిపోతున్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. ఆ క్రమంలోనే తాజాగా బీహార్‌లో పాఠశాలలు ప్రారంభం కాగా.. ఎండ వేడి తట్టుకోలేక విద్యార్థులు అల్లాడిపోయారు. కొంతమంది విద్యార్థులు సొమ్మసిల్లిపడిపోవడం కలకలం రేపింది. దీంతో విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. వేసవి సెలవులు ముగియడంతో షేక్‌పూరా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల బుధవారం తెరుచుకుంది. అక్కడ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటడంతో విద్యార్థులు ఎండను తట్టుకోలేకపోయారు.

Also Read: రేపు కేరళను తాకనున్న రుతుపవనాలు.. తెలంగాణ, ఏపీకి ఎప్పుడంటే

దాదాపు 16 మంది బాలికలు స్పృహతప్పి పడిపోయారు. టీచర్లు వారికి సపర్యలు చేసిన తర్వాత.. ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే బీహార్‌లో పాఠశాలలు తెరవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. స్థానికులు పాఠశాలలకు వెళ్లి టీచర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. ఎండలు మండిపోతున్నప్పటికీ పాఠశాలలు తెరవడం ఏంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి.

Also Read: కార్లు కడిగితే రూ.2000 ఫైన్ .. సర్కార్ షాకింగ్ నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Summer Tips: సమ్మర్ లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే డేంజర్

వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్, అలసట, చర్మ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

New Update
summer tips

summer tips

Summer Tips: వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరగడం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్, అలసట, చర్మ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు.  అందుకే ఈ కాలంలో సరైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి.

సరైన జీవనశైలి అలవాట్లు

  • వేసవిలో నీటిని ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. రోజుకు కనీసం 3–4 లీటర్లు నీళ్లు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచవచ్చు. మజ్జిగ, కొబ్బరి నీరు, తాటిపండు, దోసకాయ వంటి తండ్రీ ఆహార పదార్థాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. 
  • బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తెలుపు లేదా లేత రంగుల దుస్తులు ధరించడం మంచిది. టోపీలు, గ్లాసెస్ వంటివి వాడడం వలన ఎండ నుంచి రక్షణ లభిస్తుంది. సూర్యుడి కిరణాలు ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే అవసరమైన పనుల కోసం బయటకు వెళ్లడం ఉత్తమం. 
  • వేసవిలో ఆహారం మితంగా తీసుకోవడం, పచ్చి కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. వేసవిని సురక్షితంగా, ఆరోగ్యంగా గడపాలంటే ఈ మార్పులు అనుసరించడం అవసరం.

Summer Tips: శరీరంలో నీటి కొరత ఉంటే ఈ రోగాలు చుట్టుముడతాయి.. జాగ్రత్త!

 నిద్ర, విశ్రాంతి 

  • వేసవిలో వేడి ప్రభావం శరీర శక్తిని తగ్గిస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రతల కారణంగా శరీరం  త్వరగా అలసిపోతుంది.  అలాంటి సమయంలో శరీరానికి తగిన విశ్రాంతి చాలా ముఖ్యం. ప్రతిరోజూ కనీసం 7–8 గంటల నిద్ర తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. 
  • తీవ్ర మైన ఎండల  సమయంలో ఎయిర్ కండిషనర్ లేదా ఫ్యాన్ ఉపయోగించడం వల్ల నిద్రలో అంతరాయం కలగదు. మధ్యాహ్న సమయంలో 15–30 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం శరీరాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. 
  • వేసవిలో ఎక్కువ పని చేయడం వల్ల తలనొప్పులు, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. వాటిని నివారించాలంటే తగినంత నిద్ర చాలా అవసరం. 
  • శరీరం మానసికంగా, శారీరకంగా రిఫ్రెష్ అవ్వాలంటే విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. వేడి ప్రభావం తగ్గించడానికి గది శుభ్రంగా ఉంచడం,   ప్రాపర్ వెంటిలేషన్  ఉండేలా చూసుకోవాలి.  వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర,   విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకూడదు.

latest-news | telugu-news | summer-tips | life-style

Advertisment
Advertisment
Advertisment