Bihar VS DMK: 'మరుగుదొడ్లను శుభ్రం చేస్తారు..' డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై తేజస్వీ ఆగ్రహం!

బీహార్ నుంచి తమిళనాడుకు వచ్చినవారు మరుగుదొడ్లు శుభ్రం చేస్తుంటారన్న డీఎంకే ఎంపీ దయానిది మారన్‌కు బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ కౌంటర్ ఇచ్చారు.తమ కూలీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం మానేస్తే రాష్ట్రాలు స్తంభించిపోతాయని చెప్పారు.

New Update
Bihar VS DMK: 'మరుగుదొడ్లను శుభ్రం చేస్తారు..' డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై తేజస్వీ ఆగ్రహం!

డిగ్నిటీ ఆఫ్‌ లెబర్‌ అన్నది అన్నిటికంటే ముఖ్యం. ఇది చాలా మందికి తెలియదు. ఇక ఒక మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని జనరలైజ్‌ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అయితే సామాన్యుల దగ్గర నుంచి పెద్ద పెద్ద రాజకీయ నేతల వరకు ఓ వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం తరతరాలుగా అందరూ చూస్తున్నదే. అందిరికి ఆదర్శంగా ఉంటూ.. సక్రమ మార్గంలో నడుస్తూ.. ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడుతూ నలుగురి మధ్య తిరగాల్సిన రాజకీయ నాయకులు ఏనాడో లిమిట్‌ దాటిపోయారు. మొన్న బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌(Nitish Kumar) తన హిందీ దురహంకారాన్ని బయటపెట్టుకుంటే నిన్న డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌(Dayanidhi Masan) బీహార్‌, యూపీ సమాజంపై నోరుపారేసుకున్నాడు. బీహార్‌, యూపీ ప్రజలు మరుగుదొడ్లను శుభ్రం చేస్తారంటూ దయానిధి మారన్‌ చేసిన కామెంట్స్‌పై బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌(Tejeshwi Yadav) గట్టిగానే ఇచ్చిపడేశారు.

మేం లేకపోతే స్థంభించిపోతారు:
యూపీ, బీహార్ ప్రజల గురించి నాయకుడెవరైనా సరే నోరుపారేసుకుంటే దాన్ని కచ్చితంగా ఖండిస్తామని తేజస్వీ యాదవ్‌ చెప్పారు. INDIAకూటమీలో డీఎంకే, JDU రెండూ కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తమ రాష్ట్ర ప్రజల గురించి దయానిధి మారన్‌ చేసిన వ్యాఖ్యలను తాము అంగీకరించడం లేదన్నారు తేజస్వీ. యూపీ, బీహార్‌లకు చెందిన కూలీలకు దేశమంతటా డిమాండ్ ఉన్నదని.. వారు వేరే ప్రాంతాలకు వెళ్లడం మానేస్తే.. రాష్ట్రాలు పనిచేయడం మానేసి, స్తంభించిపోతాయని తేజస్వి యాదవ్ ధీటుగా బదులిచ్చారు.

బీహార్, యూపీ ప్రజలు కాలువలు శుభ్రం చేసేందుకు వస్తున్నారని మారన్‌ చెప్పడాన్ని తేజస్వీ యాదవ్‌ ఖండించారు. అన్ని పార్టీల నేతలు ఇలాంటి ప్రకటనలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. నిజానికి మారన్‌చేసిన వ్యాఖ్య రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపింది. పాట్నా సాహిబ్‌కు చెందిన బీజేపీ లోక్‌సభ ఎంపీ మారన్‌ వ్యాఖ్యల వీడియోలను షేర్ చేశారు. డీఎంకే నాయకులు బీహార్ ప్రజలను అవమానించడం మానేయాలని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫైర్ అయ్యారు. డీఎంకేతో కలిసి INDIAకూటమీలో ఉన్న JDU దీనిపై స్పందించాలని డిమాండ్‌ చేశారు.

Also Read: అమ్మ ప్రేమంటే ఇదే.. మృత్యువుకు ఎదురెళ్లి మరీ..ఏం చేసిందో చూడండి!
WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment