Chandrababu: చంద్రబాబుకు బెయిల్..కండిషన్లు ఇవే

ఎట్టకేలకు చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. స్కిల్ స్కామ్‌లో మధ్యంతర బెయిల్‌ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు చంద్రబాబు తరుపు న్యాయవాదులు. బాబు ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ బెయిల్ ను మంజూరు చేసింది కోర్టు.

New Update
Chandrababu: చంద్రబాబుకు బెయిల్..కండిషన్లు ఇవే

Chandrababu Gets Interim Bail: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు (Chandrababu Naidu) నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు (High Court) ఈరోజు తీర్పు చెప్పింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. నవంబర్‌ 24 వరకు షరతులతో కూడిన బెయిల్‌ ను ఇచ్చింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. నవంబర్‌ 24న బాబు తిరిగి సరండర్‌ కావాలని ఆదేశించింది. దాంతో పాటు  బెయిల్ మీద బయటకు వెళ్లాక ఆస్పత్రికి వెళ్లడం మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదని, ఫోన్‌లో మాట్లాడకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే  మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నవంబర్ 10న మెయిన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని తెలిపింది హైకోర్టు.

కోర్టు విధించిన షరతులు..
- ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు.
- కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయవద్దు
- ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి, ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది...
- చంద్రబాబుతో ఇద్దరు DSPలు ఎస్కార్ట్ ఉంచాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి..
- Z+ సెక్యూరిటీ విషయంలో... కేంద్ర నిబంధనలమేరకు అమలు చేయాలని, చంద్రబాబు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని వ్యాఖ్య..

Also read:విజయనగరం రైలు ప్రమాదం-ఈరోజు కూడా పలు రైళ్ళు రద్దు

కంటికి శస్త్రచికిత్స అవసరం అంటూ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ బాబు లాయర్లు వేశారు. అయితే ఇప్పటికిప్పుడు శస్త్రచికిత్స అవసరం లేదని సీఐడీ (CID) తరపు లాయర్లు వాదించారు. కానీ బాబు ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన లాయర్లు కోర్టును కోరారు. చంద్రబాబు ఆరోగ్య స్థితిపై వైద్యులు ఇచ్చిన నివేదికలను సీఐడీ కోర్టుకు సమర్పించింది. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని, పైగా బరువు పెరిగారని సీఐడీ లాయర్లు కోర్టు దృష్టి తీసుకెళ్ళారు. అయితే హైకోర్టు మాత్రం చంద్రబాబుకు అనుకూలంగానే తీర్పును ఇచ్చింది. ఈ అనుబంధ పిటిషన్ మీద నిన్న విచారణ పూర్తి చేశారు. ఈరోజు న్యాయమూర్తి తల్లా ప్రగడ మల్లికార్జునరావు తీర్పును వెల్లడించారు.

Also read:అమ్మకానికి 81.5 కోట్ల ఇండియన్ ఆధార్ వివరాలు..డేటా హ్యాక్

చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ (TDP) శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. దీంతో కడపలో సంబరాలు మొదలుపెట్టారు.  పులివెందుల ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, బీటెక్ రవి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు బాణసంచా పేల్చుతూ ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పవన్ కల్యాణ్ ఇంటికి అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా?

పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ తన సతీమణి స్నేహతో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడటంతో ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం మార్క్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.

New Update
Pawan kalyan

Pawan kalyan

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లినట్లు తెలుస్తోంది. సింగపూర్‌లో ఓ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి కలిశారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

భార్య స్నేహతో కలిసి..

అల్లు అర్జున్‌తో పాటు తన భార్య స్నేహ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. అయితే ఎన్నికల సమయం నుంచి మెగా ఫ్యామిలీలో గొడవలు వినిపిస్తున్నాయి. దీంతో కాస్త గ్యాప్ పెరిగింది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో కూడా పవన్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లలేదు. దీని తర్వాత అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కలుసుకోవడం ఇదే మొదటిసారి. 

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్‌కు సింగపూర్‌లో ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం వల్ల చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. అయితే ప్రస్తుతం మార్క్ శంకర్ హైదరాబాద్‌లో ఉన్నాడు.

Advertisment
Advertisment
Advertisment