Bigg Boss 7 Telugu :నాల్గవవారం నామినేషన్స్ లో రచ్చ...శివాజీ ఓవర్ యాక్షన్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 నాల్గవ వారంలోకి ప్రవేశించింది. సోమవారం నామినేషన్స్ లో రచ్చరచ్చ అయింది. మొత్తం నామినేషన్స్ లో శివాజీ ఓవర్ యాక్షన్ చేశాడు. తాను చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ప్రవర్తించాడు. శుభశ్రీ...రతికను టార్గెట్ చేస్తే...గౌతమ్, ప్రిన్స్ లు మళ్ళీ గొడవపడ్డారు.

New Update
Bigg Boss 7 Telugu :నాల్గవవారం నామినేషన్స్ లో రచ్చ...శివాజీ ఓవర్ యాక్షన్

Bigg Boss 7 Telugu: ఎప్పటిలాగే బిగ్ బాస్ నాల్గవారం నామినేషన్స్ లో కూడా గొడవలు జరిగాయి. ఒకరినొకరు తిట్టుకుంటూ, విమర్శించుకుంటూ కంటెస్టెంట్స్ రచ్చరచ్చ చేశారు. హౌస్ లో తనే సైపర్ అన్నట్టు ప్రవర్తించడం...తానే పెద్ద, మిగతా వాళ్ళందరూ చిన్నవాళ్ళు ఏమీ తెలియదు అన్నట్టు ఉండడం కంటెస్టెంట్స్ కు నచ్చడం లేదు. తాను చెప్పిందే శాసనం అన్నట్టు ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడు శివాజీ (Shivaji). నిన్నటి ఎపిసోడ్ తో రతిక (Rathika) శివాజీ మీద బాగా ఫైర్ అయింది. అసలు ఆయన్ను మనిషి అనాలా? ఇంకేమైనా అనాలా? అంటూ మండిపడింది. ఛీ ఈయనకా నేను సపోర్ట్చేసింది అంటూ తన అవేశాన్ని బయటపెట్టింది. నాగార్జున (Nagarjuna) దగ్గర ప్రశాంత్ (Pallavi Prashanth) టాపిక్ గురించి ఎందుకు మాట్లాడారంటూ శివాజీతో గొడవ పెట్టుకుంది రతికి. సారీచెప్పినా వినకపోవడంతో ఎందుకు సాగతీస్తున్నావ్? కాళ్ళు పట్టుకోవాలా అంటూ ఆమె ఫైర్ అయ్యాడు శివాజీ.

నామినేషన్స్...

ఇక ఈ వారం నామినేషన్స్ కొత్తగా ఉన్నాయి. ముగ్గురుమౌస్ మేట్స్ ను జ్యూరీ మెంబర్స్ గా కూర్చోపెట్టి ఒక్కొక్క మెంబర్నీ బోనులో నిలబెట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. జ్యూరీ ఎవరి నామినేషన్ కు మద్దతు తెలుపుతుందో వారిని ఫోటోలను గిల్టీ బోర్డు మీద పెట్టాలని చెప్పాడు. ఒకసారి గిల్టీ బోర్డు ఎక్కిన వ్యక్తిని వేరొకరు నామినేట్ చేయడానికి వీల్లేదు. ముందుగా యావర్ వచ్చి ప్రియాంక, తేజలను బోనులో నిలబెట్టాడు. ప్రియాంక తనను కంటెండర్ గా తప్పించిందని, టాస్కులు ఆడటం లేదని తేజను నామినేట్ చేశాడు యావర్. ప్రియాంక గురించి చెప్పింది కరెక్ట్ అనిపించడంతో జ్యూరీ తన ఫోటోను బోర్డు మీద పెట్టింది.

తర్వాత శుభశ్రీ రతికను, అమర్ దీప్ ను బోనులో నిల్చోబెట్టింది. చిగ్ బాస్ రూల్స్ ప్రకారం బయట ఉన్న సెలబ్రిటీల గురించి చెడుగా మాట్లాడకూడదు. కానీ రతిక తన ఎక్స్ గురించి చెడుగా మాట్లాడుతోందని రతికను నామినేట్ చేసింది. దీంతో రతికకు బాగాకోపం వచ్చింది. తాను ప్రియాంకతో చెబుతున్నది విని శుభశ్రీ చెప్పి నామినేట్ చేసిందని మండిపడింది. అక్కడ మాటలు ఇక్కడ చెబుతున్నావంటే నీ క్యారెక్టర్ స్త్రంటి అంటూ ప్రశ్నించింది. దీంతో శుభశ్రీ నోరు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చింది. కంటెండర్ గా గుండు గీయించుకోమంటే అమర్ చెయ్యలేదంటూ శుభశ్రీ నామినేట్ చేసింది. దాంతో అది నా కష్టం, నీకేంటి బాధ అని తనతో గొడవకు దిగాడు అమర్. జ్యూరీ రతికను గిల్ట్ బోర్డ్ లో పెట్టి, నామినేట్ చేశారు.

big boss season 7 nominations

తర్వాత గౌతమ్ (Goutham) వచ్చాడు. యావర్, తేజలను నామినేట్ చేశాడు. యావర్ కోపంతో తన మనోభావాలు దెబ్బతింటున్నాయన్నాడు. దీంతో గౌతమ్-యావర్లు మళ్ళీ గొడవ పడ్డారు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. యావర్ సందీప్ మాస్టర్, శివాజీల మీద కూడా అరిచాడు. తర్వాత జ్యూరీ యావర్ ను నామినేట్ చేసింది కానీ గౌతమ్ చెప్పిన కారణాల వల్ల కాదు, తమ మీద అరిచినందుకు అంటూ చెప్పింది. గౌతమ్ చెప్పినవన్నీ పిచ్చి కారణాలంటూ కొట్టిపడేశాడు శివాజీ. ఇది నచ్చని గౌతమ్ మీరు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో బిగ్ బాస్ కల్పించుకుని నామినేషన్ లో ప్రవర్తనను బట్టి కంటెస్టెంట్స్ ను నామినేట్ చేయకూడదు అని...కారణాల ఆధారంగానే ఎంపిక చేయాలి అని చెప్పాడు. జ్యూరీ మళ్ళీ ఆలోచించి నిర్ణయాన్ని చెప్పాలని ఆదేశించాడు. దీంతో ఎపిసోడ్ ముగిసింది.

ఈరోజు ఎపిసోడ్ లో జ్యూరీ ఏం చెప్పిందో...తర్వాత ఎవరు ఎవరిని నామినేట్ చేశారో తెలుస్తుంది. ఇంకా ఎన్ని గొడవలు జరిగాయో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్స్ చూడాల్సిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు