Sachin Tendulakr: సచిన్‌ కు గోల్డెన్‌ టికెట్ అందించిన షా!

ప్రపంచ కప్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బీసీసీఐ చీఫ్‌ సెక్రటరీ జై షా మాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ ను కలిశారు. సచిన్‌ కు షా గోల్డెన్‌ టికెట్ ను అందజేశారు

New Update
Sachin Tendulakr: సచిన్‌ కు గోల్డెన్‌ టికెట్ అందించిన షా!

మరికొద్ది రోజుల్లో పండుగలు మొదలవుతుంటే..క్రికెట్ అభిమానులకు మాత్రం అసలైన పండుగలు అంటే అక్టోబర్ 5 నుంచి మొదలు కానుంది. ఆ పండుగకు వేదిక కూడా భారత్ నే కానుండడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోతుంది. వన్డే వరల్డ్ కప్ మొదలవుతుండడంతో క్రికెట్‌ అభిమానుల్లో ఉత్సహం వెయ్యింతలు అవుతుంది.

ఇప్పటికే వరల్డ్‌ కప్‌ తొలి దశ టికెట్లను బీసీసీఐ విక్రయించగా..అవన్నీ కూడా హాట్‌ కేకుల్లా నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోయాయి. దీంతో టికెట్లు దొరకని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో వారికి మరో సువర్ణవకాశన్ని కల్పించింది బీసీసీఐ. అందుకే శుక్రవారం మరోసారి టికెట్లు విక్రయిస్తున్నట్లు తెలిపింది.

మరి కొద్ది రోజుల్లో ప్రపంచ కప్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బీసీసీఐ చీఫ్‌ సెక్రటరీ జై షా మాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ ను కలిశారు. సచిన్‌ కు షా గోల్డెన్‌ టికెట్ ను అందజేశారు. ఈ టికెట్ అందుకున్న వారికి వరల్డ్ కప్ మ్యాచ్‌ లను చూసేందుకు వీఐపీ యాక్సెస్‌ ఉంటుంది.

భారత్‌ లోని ప్రముఖులను ఆహ్వానించడం కోసం బీసీసీఐ గోల్డెన్‌ టికెట్లను అందజేస్తోంది. ముందుగా అమితాబ్‌ బచ్చన్‌ కు ఈ గోల్డెన్ టికెట్‌ ను అందించారు. తాజాగా సచిన్‌ కు ఈ టికెట్‌ ను అందజేసారు షా. సుమారు క్రికెట్‌ ప్రపంచంలో 20 ఏళ్లు సేవలు అందించిన సచిన్‌ కు గోల్డెన్‌ టికెట్‌ అందించి బీసీసీఐ గౌరవించింది.

‘గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్’ ప్రోగ్రాంలో భాగంగా బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా.. భారతరత్న సచిన్ టెండుల్కర్‌కు గోల్డెన్ టికెట్‌ను అందజేశారు. సచిన్ క్రికెట్ ప్రయాణం తరాలను ఇన్‌స్పైర్ చేసింది. ఇప్పుడు ఆయన ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగం కానున్నారు’ అని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా తెలిపింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పిల్లల తల్లి అదే గ్రామంలో నివసించే నలుగురు పిల్లల తండ్రితో లేచిపోయింది. ఇది మాత్రమే కాదు, ఆమె తన ప్రియుడిని వివాహం చేసుకున్న ఫోటోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

New Update
marriage 2nd

marriage 2nd

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పిల్లల తల్లి అదే గ్రామంలో నివసించే నలుగురు పిల్లల తండ్రితో లేచిపోయింది. ఇది మాత్రమే కాదు, ఆమె తన ప్రియుడిని వివాహం చేసుకున్న ఫోటోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఇద్దరి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది. 

ఈ సంఘటన ఏప్రిల్ 5వ తేదీన జరిగింది. సిద్ధార్థ్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మహారియా గ్రామానికి చెందిన గీత అనే మహిళ తన ఐదుగురు పిల్లలను, భర్తను వదిలి ఇంట్లోని నగదు, నగలను తీసుకుని అదృశ్యమైంది. తన భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఉండవచ్చని ఆమె భర్త  శ్రీ చంద్ అనుకున్నాడు. కానీ మూడు రోజుల తర్వాత గ్రామానికి చెందిన గోపాల్ అనే యువకుడితో అతని భార్య పెళ్లి ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.  ఇది చూసి ఆ మహిళ భర్త శ్రీ చంద్ షాక్ అయ్యాడు. 

పెద్ద కూతురికి 19 సంవత్సరాలు

శ్రీ చంద్ కు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సహా 5 మంది పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురికి దాదాపు 19 సంవత్సరాలు, చిన్న కూతురికి 5 సంవత్సరాలు. శ్రీ చంద్ గతంలో ముంబైలోని ఒక వడా పావ్ దుకాణంలో పనిచేసేవాడు. గత కొన్ని రోజులుగా, అతను గ్రామంలో కూలీగా పనిచేస్తూ తన పిల్లలను పోషించుకుంటున్నాడు. తన భార్య ఇంట్లో నుంచి తీసుకెళ్లిన నగలు, రూ.90 వేలు తిరిగి ఇవ్వాలని, ఇకపై ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని  శ్రీ చంద్ చెప్పాడు.

మరోవైపు, శ్రీ చంద్ భార్యతో పారిపోయిన ప్రేమికుడు గోపాల్ పట్వాకు నలుగురు పిల్లలు ఉన్నారు. గోపాల్ ముంబైలో రాఖీ తయారీదారుగా కూడా పనిచేసేవాడని అతని భార్య చెప్పింది. అతను చాలా కాలంగా కుటుంబానికి ఖర్చులు ఇవ్వడం లేదని తెలిపింది.  తాను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపింది.  ఇప్పటి వరకు తాను అన్నీ భరించాను కానీ ఇప్పుడు తన భర్త  రెండో  వివాహం చేసుకున్నాడు కాబట్టి, ఆస్తిలో తన పిల్లలకు వాటా ఇవ్వాలని కోరుతానంది.  ఈ విషయం గురించి తాను పోలీస్ స్టేషన్ కు వెళ్లానని, కానీ ఎవరూ తన మాట వినలేదని గోపాల్ భార్య చెబుతోంది. 

Also read :  Crime: ఛీ.. ఛీ వీడు మనిషేనా! పదేళ్ల బాలికను రేప్ చేసి.. ఆ తర్వాత

 

 

 

Advertisment
Advertisment
Advertisment