AP : వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్..!

బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుల లారీని పోలీసులు అడ్డుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తుండగా తుళ్ళూరు పోలీసులు అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తున్న లారీని, లారీ డ్రైవర్ చెన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు.

New Update
AP : వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్..!

Bapatla :  ఏపీ (Andhra Pradesh) లో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు హై అలర్ట్ అయ్యారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా, బాపట్ల వైసీపీ (YCP) మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుల లారీని పోలీసులు అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తుండగా తుళ్ళూరు పోలీసులు అడ్డుకున్నారు.

Also Read: అతి దారుణం.. నడిరోడ్డులో మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి..

నేడు తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఉద్దండరాయునిపాలెం రీచ్ నందు అక్రమంగా ఇసుక తరలిస్తున్న AP 37TK 4793 నంబర్ గల లారీని పోలీసులు పట్టుకున్నారు. లారీ తో పాటు స్కార్పియో వాహనాన్ని తుళ్ళూరు ఎస్సై వేణుగోపాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. లారీ డ్రైవర్ చెన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. లారీ.. ఏలూరు జిల్లా ఈదరకి చెందిన సుధీర్ గా గుర్తించారు. నందిగం సురేష్ (Nandigam Suresh) తో చాలా కాలంగా సుధీర్ కి అనుబంధం ఉందని సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు