PM Modi : లోక్ సభ ఎన్నికల వేళ ప్రధాని మోదీకి షాక్

లోక్ సభ ఎన్నికల వేళ ప్రధాని మోదీకి పౌర సమాజ సంఘాలు షాక్ ఇచ్చాయి. ప్రధాని మోదీపై 96 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశాయి. ప్రచారాల్లో మతల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేల మోదీ వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంది.

New Update
PM Modi : 8న మోదీ ప్రమాణ స్వీకారం.. ఆ డేట్ తో ప్రధానికి ఉన్న సెంటిమెంట్ ఇదే!

Lok Sabha Elections 2024 : ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల మధ్య, దేశంలో సార్వత్రిక ఎన్నికల(General Elections) నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేస్తూ పౌర సమాజ సంఘాలు భారత ఎన్నికల సంఘానికి లేఖలు రాశాయి. 2019 ఓటరు డేటాలో ఓటర్ల లెక్కలను ప్రకటించలేదని.. అందులో సరైన లెక్కలు వివరించలేదని.. అందులో సరైన లెక్కలు లేవనే అనుమానాలను వ్యక్తం చేశారు.

ALSO READ: మోదీ మూడోసారి ప్రధాని అవ్వబోతున్నారు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

ఎన్నికల సమయంలో విద్వేషపూరిత ప్రసంగాలను ఎదుర్కోవడంలో వైఫల్యం, సర్రోగేట్ ప్రకటనలపై చర్యలు తీసుకోవడంలో వైఫల్యం, పార్టీలపై సమానమైన నిష్పాక్షికమైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం, ప్రచార ఉల్లంఘనలను ఆపడంలో వైఫల్యంపై కూడా వారు ప్రశ్నలు లేవనెత్తారు.

ఎన్నికల సంఘాని పౌర సమాజ సంఘాల డిమాండ్లు..

1) ప్రధాని మోదీ(PM Modi) పై 96 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించాలి.
2) సూరత్, ఇండోర్, గాంధీనగర్, ఇతర ప్రాంతాలలో ఉపసంహరించుకోవడానికి ప్రోత్సాహకాలను ఉపసంహరించుకోవాలని అభ్యర్థులపై ఒత్తిడి తీసుకురావడంపై విచారణకు ఆదేశించాలి.
3) 2019లో పోల్ చేయబడిన, లెక్కించబడిన ఓట్ల వ్యత్యాసాల వివరణ ఇవ్వాలి.
4) ఇప్పటివరకు నిర్వహించిన మూడు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యను ECI వెంటనే ప్రకటించాలి.
5) ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి అన్ని పార్టీలపై చర్య తీసుకున్నట్లు నిర్దారించాలి.
6) రాజకీయ పార్టీల సర్రోగేట్ ప్రకటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలి.

లోక్ సభ ఎన్నికల ఫేజ్ 5, 6, 7 కోసం ప్రచారం బలం పుంజుకుంది, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ఇండియా బ్లాక్ రెండూ ఓటర్లను ప్రలోభపెట్టడానికి తమ బలాన్ని పెంచుతున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదల కాగా, ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ప్రతిపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు