చిరుతనా? ఎలుగుబంటినా? లక్షిత మరణానికి కారణం ఏంటి?

చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన ఫోరెన్సిక్‌ నిపుణులు. చిన్నారిని చిరుతే చంపినట్లు పేర్కొన్న నిపుణులు. లక్షిత పై దాడి చేసింది చిరుత పులే. చిన్నారి తండ్రి దినేష్ కుమార్ సైతం లక్షిత ను చిరుత పులి దాడి చేసినట్టుగా స్పష్టం చేశారు.

New Update
చిరుతనా? ఎలుగుబంటినా? లక్షిత మరణానికి కారణం ఏంటి?

తిరుమల తిరుపతి అలిపిరి నడక మార్గంలో మరోసారి విషాదం నెలకొంది. చిన్నారి పై చిరుత దాడి చేసి, చంపేసినట్లుగా చిన్నారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. అయితే చిన్నారిని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది చిరుత కాదేమోననే అనుమానాన్ని ఫారెస్ట్ అధికారులు వ్యక్త పరుస్తున్నారు.

పాప ఎలుగుబంటి దాడిలో చనిపోయినట్లు భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాప ఒక్కటే నడిచి వెళ్తున్న సమయంలో ఎలుగుబంటి పాపను తీసుకుని వెళ్లినట్లు అనుమానం అని పేర్కొన్నారు. పాప మెట్ల మార్గంలో నడవకుండా పక్కకు వెళ్లడంతోనే ఒక్కసారిగా ఎలుగు బంటి దాడి చేసి అపహరించినట్లు అధికారులు భావిస్తున్నారు.

పాప మృతదేహం మీద ఉన్న గాయాలను చూస్తుంటే ఎలుగుబంటే దాడి చేసినట్లు తెలుస్తుందని వారు పేర్కొన్నారు. సీసీ కెమెరా విజువల్స్‌ ని చూస్తే ఈ విషయం మీద స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

చిరుతే చంపింది!

చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన ఫోరెన్సిక్‌ నిపుణులు. చిన్నారిని చిరుతే చంపినట్లు పేర్కొన్న నిపుణులు. లక్షిత పై దాడి చేసింది చిరుత పులే. చిన్నారి తండ్రి దినేష్ కుమార్ సైతం లక్షిత ను చిరుత పులి దాడి చేసినట్టుగా స్పష్టం చేశారు. అయితే కొందరు మాత్రం పాప మీద ఎలుగు బంటి దాటి చేసినట్లు పేర్కొంటున్నారు.


అసలేం జరిగింది..!

నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన దినేశ్ కుటుంబం తిరుమల వచ్చారు. అలిపిరి నడకదారి మార్గంలో తిరుమలకు స్టార్ట్ అయ్యారు. నడుచుకుంటూ వెళ్తుండగా.. సడన్‌గా పాప లక్షిత తమతో లేదన్న విషయాన్ని కుటుంబసభ్యులు గమనించారు. లక్షిత ఎక్కడో తప్పిపోయి ఉంటుందని అంతా భావించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా మిస్సింగ్‌ కేసే అనుకున్నారు. తల్లిదండ్రులు కూడా పాప కనిపించలేదనే అనుకున్నారు కానీ చిరుత దాడి చేస్తుందని అసలు ఊహించలేకపోయారు.

లక్షిత కోసం గాలించడం మొదలుపెట్టిన టీటీడీ అటవీ శాఖ, విజిలెన్స్, పోలీసులకు నరసింహస్వామి ఆలయం వద్ద లక్షిత మృతదేహం కనిపించింది. లక్షిత శరీరంపై గాయాలు చూస్తే చిరుత దాడి చేసినట్టు వారికి క్లియర్‌గా అర్థమైపోయింది. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా.. పాపను ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు బోరునా విలిపించారు.

నిన్నమొన్నటి వరకు లక్షిత ముద్దుముద్దు మాటలతో మురిసిపోయిన ఆ కుటుంబసభ్యుల ముఖాల్లో ఇప్పుడు విషాదం తప్ప మరెదీ కనిపించని స్థితి. ఎంతో చలాకీగా ఉండే లక్షితను అలా చూసే సరికి కుటుంబసభ్యులు తట్టుకోలేకపోతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan : విద్యార్థులు పరీక్ష అందుకోలేకపోయిన పరిస్థితిపై విచారణ

పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

New Update
pawan kalyan

pawan kalyan Photograph: (pawan kalyan)

Pawan Kalyan :పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు  పవన్ కళ్యాణ్  ఆదేశించారు. కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు.  పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి అనే దానిపై విచారణ చేయాలని ఆదేశించారు.  సర్వీసు రోడ్లలో ఉన్న ట్రాఫిక్ ను ఏమైనా నియంత్రించారా విషయాలను కూడా తెలుసుకోవాలన్నారు.తదితర అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు పవర్‌ కళ్యాణ్‌  ఆదేశాలు జారీ చేశారు.

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

 తన పర్యటనల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఇప్పటికే పవన్ సూచించారు.కూటమి ప్రభుత్వంలో ముఖ్యుల పర్యటనల సందర్భంలో స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పోలీసులు ట్రాఫిక్ రెగ్యులేషన్ ,హెలికాప్టర్ లో వెళ్ళినా రోడ్డుపై ట్రాఫిక్ నిలవడం, చెట్లు కొట్టడం లాంటివి చేయడం ఆపడం లేదని తెలిపారు.పార్టీ శ్రేణులు, నాయకులకు సైతం క్రేన్ దండలు కార్యక్రమాలు, ట్రాఫిక్ అవాంతరాలు కలిగించే చర్యలు చేపట్టరాదని కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Also read :  Ram Navami 2025: అయోధ్యలో అద్భుతం. రామ్‌ లల్లాకు సూర్య తిలకం


కాగా ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పరీక్ష కి ఆలస్యం అయిందని కొంతమంది విద్యార్థులు ఆరోపించారు. కన్వాయి వల్ల - పెందుర్తి అయాన్ డిజిటల్  JE అడ్వాన్స్ విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్ళాల్సి వచ్చిందని వాపోయారు. 30 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష   రాయకుండా వెనిదిరగాల్సి వచ్చింది. దీనివల్ల - పిల్లల భవిష్యత్తు అగమ్య అవుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

Advertisment
Advertisment
Advertisment