Telangana: బీఆర్ఎస్‌లోకి బాబు మోహన్‌ కొడుకు ఉదయ్‌ ..

ఆందోల్‌ బీజేపీ అభ్యర్థి బాబుమోహన్‌ కొడుకు ఉదయ్ బాబుమోహన్ బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి టికెట్‌ ఆశించిన ఉదయ్‌కు టికెట్‌ ఇవ్వకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

New Update
Telangana: బీఆర్ఎస్‌లోకి బాబు మోహన్‌ కొడుకు ఉదయ్‌ ..

ప్రముఖ నటుడు, ఆందోల్‌ బీజేపీ అభ్యర్థి బాబుమోహన్‌కు మరో షాక్‌ తగిలింది. ఆయన కొడుకు ఉదయ్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఉదయ్‌ ఆందోల్‌ నుంచి బీజేపీ టికెట్‌ ఆశించారు. అలాగే బాబు మోహన్‌ కూడా తన కొడుక్కే టికెట్‌ ఇవ్వాలని హైకమాండ్‌ను అభ్యర్థించారు. కానీ అధిష్ఠానం మాత్రం చివరికి బాబు మోహన్‌కే టికెట్‌ ఇచ్చింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఉదయ్.. బీఆర్‌ఎస్‌లో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. 2014లో బీఆర్‌ఎస్‌(అప్పుడు టీఆర్‌ఎస్‌) పార్టీలో చేరిన బాబు మోహన్‌.. ఆ ఎన్నికల్లో ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే 2018లో ముందస్తు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఆయనకు టికెట్‌ నిరాకరించింది. దీంతో బీజేపీలోకి వెళ్లిన బాబు మోహన్‌ ఆ పార్టీ నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు.

Also read: ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్య.. ఆయన్ని వేధించింది వారేనా.. ?

Advertisment
Advertisment
తాజా కథనాలు