Bhadradri Kothagudem: కులమతాలకతీతంగా దర్గాలో అయ్యప్ప పడిపూజ!

కులమతాలకతీతంగా దర్గాలో అయ్యప్ప పడిపూజ ఘనంగా జరిగింది. ఇల్లందు పట్టణంలో హజరత్ నాగుల్ మీరా మౌలాచాన్ దర్గా షరీఫ్ లో అయ్యప్ప స్వాములతో ఘనంగా పడిపూజ నిర్వహించారు దర్గా నిర్వాహకులు. పడిపూజలో హిందూ ముస్లిం సోదరులు భారీగా పాల్గొన్నారు.

New Update
Bhadradri Kothagudem: కులమతాలకతీతంగా దర్గాలో అయ్యప్ప పడిపూజ!

Bhadradri Kothagudem District: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని సత్యనారాయణపురం (Satyanarayanapuram) సమీపంలో గల నాగుల్ మీరా చాంద్ మౌలచాన్ దర్గా (Dargah) షరీఫ్‌లో ఘనంగా అయ్యప్ప స్వాముల పడిపూజ ( Ayyappa padipuja )నిర్వహించిన దర్గా నిర్వాహకులు. ఈ దర్గా 20 సంవత్సరాల క్రితం సత్యనారాయణపురంలోని అటవీ ప్రాంతంలో దర్గా వెలసింది దర్గా..నిర్వాహకుడు ఒక హిందూ ఆయన కలలో ఈ ప్రాంతంలో దర్గాను నిర్వహించాలని దేవుడు చెప్పడంతో ఇక్కడ దర్గా ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: కివీ పండు పొట్టు సులభంగా వలిచే చిట్కాలు..మీరూ ట్రై చేయండి

దర్గాలో మాలిక్‌గా ఒక హిందువుగా ఉండడం విశేషం. రెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు (devotees) వచ్చి లక్షలాదిగా మొక్కులు తీర్చుకుంటారు. అంతేకాదు.. రాష్ట్ర మంత్రులు  (Ministers)కూడా ఇక్కడికి వచ్చి మొక్కలు తీసుకుంటారు. ఇదే క్రమంలో కులమతాలకతీతంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ దర్గాలో సీతారాముల కళ్యాణం కూడా నిర్వహించారు.

ఇది కూడా చదవండి: అల్లంతో మన ముఖంపై అద్భుతాలు.. ఒక్క ముక్క అల్లం చాలు

ఇప్పుడు అయ్యప్ప పడిపూజను నిర్వహించడంతో హిందూ ముస్లిమ్స్ (Hindu- Muslims) వచ్చి పడి పూజలో పాల్గొని దేవుని సంకీర్తనలతో మారుమోగింది. అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పడి పూజను ఘనంగా నిర్వహించుకున్నారు. దర్గా నిర్వాహకులు వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కుల మతాలకతీతంగా అతీతంగా వివిధ మతాలకు మధ్య స్నేహభావాన్ని (Friendship) పెంచే విధంగా కార్యక్రమాలు ఉండడంతో దర్గా నిర్వాహకులను పలువురు ప్రశంసిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అల్లంతో మన ముఖంపై అద్భుతాలు.. ఒక్క ముక్క అల్లం చాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment