Ayodhya Helicopter: అయోధ్య రాముడిని హెలీకాప్టర్లో తిరుగుతూ చూసేయొచ్చు.. అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రతిష్ట కోసం ముహూర్తం దగ్గర పడుతోంది. దేశ ప్రజలు అందరూ ఆ ఘడియల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అయోధ్య వెళ్లడం కోసం లక్నో నుంచి హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ద్వారా లక్నో నుంచి 30-40 వ్యవధిలో అయోధ్య చేరుకోవచ్చు By KVD Varma 16 Jan 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Ayodhya Helicopter: దేశం మొత్తం అయోధ్య దర్శనం కోసం తహ తహలాడిపోతోంది. అయోధ్య రామాలయంలో జనవరి 22న బాల రాముడు కొలువు కాబోతున్నాడు. దీంతో ఇక్కడ హోటల్ పరిశ్రమ.. విమానయాన రంగంలో విపరీతమైన బూమ్ కనిపిస్తోంది. ఈరోజు అంటే జనవరి 16 నుంచి ముంబై నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు కూడా ప్రారంభమవుతున్నాయి. అంటే ఇకపై భక్తులు ముంబై నుంచి నేరుగా అయోధ్యకు వేగంగా.. సులభంగా చేరుకోగలుగుతారు. అయితే, భక్తులకు మరో ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. ఇది లక్నో నుంచి ఉంటుంది. ఇప్పుడు లక్నో నుంచి అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సర్వీసుల ప్రారంభానికి జనవరి 19 తేదీని ఫిక్స్ చేశారు. ఈ హెలికాఫ్టర్ (Ayodhya Helicopter)సర్వీసుల గురించి పూర్తి వివరాలు ఇవే.. ఛార్జీ ఎంత ఉంటుంది? ఈ సర్వీసు (Ayodhya Helicopter)కింద పనిచేసే హెలికాప్టర్లు 8-18 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్రయోజనాన్ని పొందేందుకు ప్రయాణికులు ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. జనవరి 16 సాయంత్రంలోగా ఛార్జీలు - బుకింగ్ షెడ్యూల్ గురించి సమాచారం ఇవ్వాలని కంపెనీ తెలిపింది. ఈ సర్వీస్(Ayodhya Helicopter) ప్రారంభమైన తర్వాత, లక్నో - అయోధ్య మధ్య ప్రయాణ సమయం 30-40 నిమిషాలుగా ఉంటుంది. అక్కడి పత్రికలలో వచ్చిన వార్తల ప్రకారం అయోధ్య - లక్నో మధ్య ప్రయాణించే 6 హెలికాప్టర్ల కోసం ప్రాథమిక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. Also Read: తగ్గడం కష్టమేనేమో.. మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే.. చార్టర్ విమానాల కోసం డిమాండ్.. Ayodhya Helicopter: క్లబ్ వన్ ఎయిర్ మూడు ఫాల్కన్ 2000 12-సీటర్ బిజినెస్ జెట్లను బుక్ చేసింది. చార్టర్ల కోసం JetSetGo CEO కనికా టేక్రివాల్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, అయోధ్యకు చార్టర్ విమానాల కోసం డిమాండ్ పెరుగుతోందని, ఇందులో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్,నాగ్పూర్తో సహా వివిధ నగరాల నుంచి 25 ఎంక్వయిరీస్ ఉన్నాయి. జెట్సెట్గోకు చెందిన టెక్రీవాల్ మాట్లాడుతూ, విమానాల పరిమాణాన్ని బట్టి లీజుకు తీసుకున్న రూట్లకు సగటు ధర రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. పొగమంచు, తక్కువ దృశ్యమానత కారణంగా అయోధ్య విమానాశ్రయానికి వెళ్లడం సవాలుగా ఉంటుంది. అయితే, అనుమతులపై తమకు కొంత స్పష్టత అవసరమని, దీనిపై పని జరుగుతోందని చార్టర్ - ఎయిర్ అంబులెన్స్ ఆపరేటర్ MAB ఏవియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మందర్ భర్డే అన్నారు. ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా అయోధ్య విమానాశ్రయాన్ని నిర్మించారు, కానీ ఇప్పుడు రోజుకు ఆరు గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆలయ ప్రారంభోత్సవ సమయంలో అవసరాన్ని బట్టి 12 గంటలు లేదా 24 గంటలు తెరుస్తామని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కుమార్ తెలిపారు. Watch this interesting Video #ayodhya-rama-temple #ayodhya సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి