/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/mim-chief-owaisi-house-attack.jpg)
MIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై మరోసారి అటాక్ జరిగింది. ఢిల్లీలోని ఆయన నివాసంపై దుండగులు దాడి చేశారు. ఓవైసీ ఇంటిపై బ్లాక్ ఇంక్తో పాటు పోస్టర్లు అంటించారు. ఇంటి నేమ్ ప్లేట్, గేటుపై ఆయన పేరు కనిపించకుండా బ్లాక్ ఇంక్ పూశారు. భారత్ మాతాకీ జై, ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అంటూ పోస్టర్లు అంటించారు. లోక్సభలో ప్రమాణ స్వీకారం సందర్భంగా అసదుద్దీన్ 'జై పాలస్తీనా' అనడంపై దుమారానికి కారణమైంది. పార్లమెంట్ సాక్షిగా మరో దేశం పేరు పలకడంపై బీజేపీ సహా పలు పార్టీలు భగ్గుమంటున్నాయి. ఓవైసీ వైఖరిని తప్పుబడుతూ దుండగులు ఇంటికి పోస్టర్లు అంటించారు. ఓవైసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Some “unknown miscreants” vandalised my house with black ink today. I have now lost count the number of times my Delhi residence has targeted. When I asked @DelhiPolice officials how this was happening right under their nose, they expressed helplessness. @AmitShah this is… pic.twitter.com/LmOuXu6W63
— Asaduddin Owaisi (@asadowaisi) June 27, 2024
ఎంపీలకు భద్రత లేదా?
ఢిల్లీలోని తన ఇంటిపై జరుగుతున్న దాడులపై అసదుద్దీన్ సీరియస్ అయ్యారు. తన ఇంటిపై దాడి చేసిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి దాడులకు భయపడేదే లేదని చెప్పారు. ఇలాంటి పిరికిపంద చర్యలు ఆపాలని హెచ్చరించారు. రాళ్లు విసరడం, సిరా చుక్కలు చల్లడం లాంటివి కాకుండా తనతో డైరెక్ట్గా ఫైట్ చేయాలని సవాల్ విసిరారు ఒవైసీ. పదే పదే తన ఇంటిని టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యవేక్షణలో ఇదంతా జరిగిందని ఆరోపిస్తున్నాయి MIM వర్గాలు. ఎంపీల భద్రతకు ఎలాంటి గ్యారంటీ ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై స్పీకర్ను కోరారు ఓవైసీ.
అప్పుడు కూడా ఇలానే చేశారు:
అయితే గతంలోనూ పలుమార్లు ఓవైసీ ఇంటిపై దాడులు జరిగాయి. 2023 ఫిబ్రవరిలో జైపూర్లో ఉన్నప్పుడు ఒవైసీ ఇంటిపై రాళ్లు రువ్వారు దుండగులు. ఆ సమయంలో ఒవైసీ సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుండగులు తన ఇంటిపై రాళ్లు రువ్వారని, అద్దాలు పగులగొట్టారని ఆరోపించారు. 2022 యూపీలో ఎన్నికల ప్రచారంలో కూడా ఒవైసీపై కాల్పులు జరిగాయి.
అసలేం జరిగింది?
జూన్ 25న పార్లమెంట్లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఒవైసీ 'జై పాలస్తీనా' అంటూ నినాదాలు చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన 'జై భీమ్, జై మైమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా' అన్నారు. ఎన్డీయే ఎంపీలు ఈ నినాదాలను నిబంధనలకు విరుద్ధమన్నారు. అయితే అణగారిన ప్రజల సమస్యలను లేవనెత్తుతూనే ఉంటానని ఒవైసీ చెబుతున్నారు. తాను చెప్పాల్సింది చెప్పానని, అది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదంటున్నారు ఒవైసీ. అటు కేంద్రమంత్రులు జి కిషన్ రెడ్డి, కిరణ్ రిజిజు ఒవైసీ 'జై పాలస్తీనా' నినాదాన్ని వ్యతిరేకించారు. ఈ నినాదం సభా నిబంధనలకు విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని కిషన్రెడ్డి విమర్శించారు.