Health Tips: మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటున్నారా ? .. అయితే, ఇది మీకోసమే

మనలో చాలామందికి మజ్జి తాగడం అలవాటుగా ఉంటుంది. అయితే, మజ్జిగలో ఉప్పు కలుపుకొని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు లేకుండా మజ్జిగ తాగితే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు.

New Update
Health Tips: మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటున్నారా ? .. అయితే, ఇది మీకోసమే

Buttermilk With Salt: మనలో చాలా మందికి అన్నం తిన్న వెంటనే మజ్జిగ తాగే అలవాటు ఉంటుంది. మజ్జిగ తాగడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మంచిగా పనిచేస్తుందని అంటుంటారు. మరి కొందరు చలువ చేస్తుందని అంటారు. అలాగే శరీరంలో వేడిని తగ్గిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఆహారం తీసుకున్న తరవాత మజ్జిగను తాగడం వల్ల జీర్ణక్రియ మంచిగా పనిచేయడం జరుగుతుందని.. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, లాక్టిక్‌ యాసిడ్‌ జీవక్రియను మెరుగుపరుస్తాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అయితే, మజ్జిగలో ఉప్పు కలుపుకొని తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా సరైన మోతాదులో తీసుకుంటేనే మంచిదని వైద్యులు తెలుపుతున్నారు.

ALSO READ : BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదు

రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మజ్జిగను ఉప్పు లేకుండా తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. మజ్జిగలో చాలా పోషకాలుంటాయని.. పొటాషియం, విటమిన్ బి12, కాల్షియం, ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాలు మనల్ని అనారోగ్యం బారిన పడకుండా ఉంచడానికి సహాయపడతాయని తెలుపుతున్నారు. ఎండా కాలంలో మజ్జిగ తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.

ALSO READ: రాక్ష‌స పాల‌న‌లో అమ్మాయిలకు రక్షణ లేదు.. జగన్ పై లోకేష్ ఫైర్

మజ్జిగను ఉప్పుతో కలిపిన తాగడం వల్ల మన శరీరంలో నీరసం, అలసటి, పొట్ట భారంగా అనిపించడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే మజ్జిగను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా ఉంటే పేగులలోని మంచి బ్యాక్టీరియా చనిపోతుందని వైద్యులు అంటున్నారు. కాబట్టి, మజ్జిగలోకి ఉప్పును కలిపి తీసుకోవడంతగ్గించాలని సూచిస్తున్నారు. పుల్లగా ఉండే పెరుగులో ఎన్నో రకాల ఆమ్ల పదార్థాలు ఉంటాయి... ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రయోజనాలు సక్రమంగా శరీరానికి అందాలంటే ఉప్పు లేకుండా మజ్జిగ, పెరుగు తీసుకోవాలని పేర్కొన్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment