Araku Valley: 'అరకులోయ'... రెడీ ఫర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.!

అల్లూరి జిల్లా అరకులోయ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ముస్తాబయింది. హోటళ్లు, లాడ్జిలు, దేవాలయాలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. పర్యాటక ప్రదేశాలు జనంతో కిటికిటలాడుతున్నాయి. ఎక్కడికక్కడ ఫైర్ క్యాంపు లతో ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు.

New Update
Araku Valley: 'అరకులోయ'... రెడీ ఫర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.!

New Year Celebrations in Araku: అరకులోయ అందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుసగా సెలవులు వస్తే చాలు వివిధ ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రియులు పోటెత్తుతారు. ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు అరకులోయ అందంగా రెడీ చేశారు. హోటళ్లు, లాడ్జిలు, దేవాలయాలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి.

Also Read: అమలాపురం వైసీపీలో అయోమయం.. టికెట్ కోసం తండ్రీకొడుకుల మధ్యే వార్!

పర్యాటక ప్రదేశాలు జనంతో కిటికిటలాడుతున్నాయి. ఎక్కడికక్కడ ఫైర్ క్యాంపు లతో ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. ఇప్పటికే ఉన్న హోటల్లో లాడ్జిలో ఫుల్ అవడంతో సదుపాయాలు దొరకని వారు రోడ్ల ప్రక్కనా, చెట్ల కింద కాలక్షేపం చేస్తున్నారు. గిరిజన మ్యూజియంకు వచ్చే పర్యాటకులకు ఐటీడీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Also Read: జూబ్లీహిల్స్‌లో భారీగా పట్టుబడిన డ్రగ్స్.. తొలిసారి బ్రౌన్‌షుగర్ పట్టివేత..

న్యూ ఇయర్ కావడంతో ఈ రెండు రోజులు రాత్రీ, పగలు మ్యూజియం తెరిచి ఉండే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, పర్యాటకులకై పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు రెడీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే విశాఖలో ఎక్కడ చూసినా పర్యాటక సందడి కనిపిస్తోంది. ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని బీచ్‌లు, అరకు, లంబసింగి, పాడేరు పర్యాటక ప్రదేశాలు నిండిపోయాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది

New Update

AP Crime: విశాఖలో గర్భిణీ అనూషను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ ప్రకారం.. పీఎం పాలెం పీఎస్‌ పరిధిలో గర్భిణీ అనూష హత్య ఘటనలో ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు తెలిపారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తెలింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ పలు నాటకాలు ఆడిన్నారు. ముందు తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేశాడు.

గతంలో చంపడానికి ప్లాన్..

ఆమె అంగీకరించకపోవడంతో మరో నాటకం ఆడాడు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని అనూషకు చెప్పాడు. అందుకే.. విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జ్ఞానేశ్వర్ భార్యను బయటకు తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని, జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు స్నేహితులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ఫ్లాన్‌ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్‌ అందరికీ వీడియో కాల్‌ చేశాడు.
 
ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగితే ఇవే లాభాలు

రాత్రికి రాత్రి అనూషను చున్నీతో చంపేశాడు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నట్లు బాధితురాలి స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అయితే.. మంగళవారం డెలివరీ ఉండగా.. సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడు. ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకున్నాడు. ఉదయం బంధువులు లేపినా.. అనూష లేవలేదు. వారితోపాటే అతనూ నిద్ర లేపుతున్నట్లు నటించాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.   

ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

( AP Crime | ap-crime-news | ap-crime-report | ap crime updates | ap crime latest updates )

Advertisment
Advertisment
Advertisment