Murder: ఏపీలో దారుణం.. భర్తను స్క్రూడ్రైవర్తో అక్కడ పొడిచి చంపిన భార్య! మద్యం మత్తులో వేధింపులకు గురిచేస్తున్న భర్త అప్పారావును కీర్తన అనే ఇల్లాలు స్క్రూడ్రైవర్తో పొడిచి చంపింది. ఈ ఘటన ఏపి కృష్ణా జిల్లాలో చోటుచేసుకోగా పోలీసులు కేసు నమోదు చేసి, పలుకోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. By srinivas 03 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Vijayawada: ఏపీలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో విసిగిస్తున్న భర్తను భార్య క్రూరంగా కడతేర్చింది. రోజూ తాగి ఇంటికి రావడమే కాకుండా రాత్రంతా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే ఆవేశంతో స్క్రూడ్రైవర్తో పొడిచి హతమార్చింది. ఈ భయంకరమైన ఘటన జనాలను కలిచి వేయగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వేధింపులు భరించలేక.. ఈ మేరకు కృష్ణ జిల్లా బంటుమిల్లి ఎస్సై జి.వాసు తెలిపిన వివరా ప్రకారం.. బంటుమిల్లి మండలం చిన్న తుమ్మడికి చెందిన జి.అప్పారావు (30) మద్యం సేవించి ఇంటికొచ్చాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారితీసింది. భర్త వేధింపులు భరించలేకపోయిన కీర్తన ఇంట్లో ఉన్న స్క్రూడ్రైవర్తో అప్పారావు మెడపై దాడిచేసింది. తీవ్ర రక్తాస్రావమైన అప్పారావు అక్కడికక్కడే చనిపోయాడని తెలిపారు. అప్పారావు, కీర్తనలకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి జరగగా.. వీరికి తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read: పవన్ ఎంట్రీతో వీడిన మిస్సింగ్ మిస్టరీ.. 9 నెలలుగా ఆ యువతి ఎక్కడుందో తెలుసా? #vijayawada #screwdriver #keerthana #apparao సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి