Prabhas : వరద భాదితులకు ప్రభాస్ భారీ విరాళం

తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో టాలీవుడ్‌ యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ రెండు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్లను విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా వరద బాధితులకు మంచినీరు, ఆహారం కూడా ఏర్పాటు చేశారు.

New Update
Prabhas : వరద భాదితులకు ప్రభాస్ భారీ విరాళం

Prabhas: తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌ ప్రముఖులంతా కలిసి రెండు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, మహేశ్‌ బాబు, యంగ్‌ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్‌ వంటి వారు ఇప్పటికే తమ విరాళాలను ప్రకటించారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ బాహుబలి ప్రభాస్‌ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించారు. అంతే కాకుండా వరదలకు గురైన ప్రాంతలో ప్రజలకి భోజనాలు నీళ్లు ఏర్పాటు ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన గొప్ప హృదయాన్ని మెచ్చుకుంటున్నారు.

Also Read: ఆ జిల్లాలో విద్యాసంస్థలకు ఐదు రోజులు సెలవులు

Advertisment
Advertisment
తాజా కథనాలు