AP : నేడు ఏపీ కొత్త టెట్‌ నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే!

ఏపీలో టెట్ కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు అంతా రెడీ అయ్యింది. జులై 1 న టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి..జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ రానుండడంతో మరోసారి టెట్‌ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి.

New Update
AP : నేడు ఏపీ కొత్త టెట్‌ నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే!

AP TET Notification : ఏపీ (Andhra Pradesh) లో టెట్ (TET) కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు అంతా రెడీ అయ్యింది. జులై 1 న టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి..జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ రానుండడంతో మరోసారి టెట్‌ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. ఈ వినతులు మేరకు ఏపీ ప్రభుత్వం టెట్ పరీక్షలు నిర్వహించేందుకు రెడీ అయ్యింది.

ఏపీ టెట్‌ 2024 (AP TET 2024) ఆన్లైన్‌ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం http://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో ఉంచామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌ కుమార్ తెలిపారు. షెడ్యూల్‌, నోటిఫికేషన్స్‌, ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌ లతో పాటు సిలబస్‌ వివరాలన్నింటిని కూడా వెబ్‌ సైట్‌ లో పెట్టినట్లు వివరించారు.

పరీక్షలు అన్ని కూడా ఆన్లైన్ విధానంలో జరుగుతాయని అధికారులు వివరించారు. మెగా డీఎస్సీ (Mega DSC) కోసం మరోసారి టెట్‌ పరీక్షను నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. డీఎస్సీతో పాటు టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ డీఎస్సీలో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు 6,371, స్కూల్‌ అసిస్టెంట్లు 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ 1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు 286, ప్రిన్సిపాల్స్ 52, వ్యాయామ ఉపాధ్యాయులు 132 ఉద్యోగాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇదంతా ఇలా ఉంటే...టెట్‌ లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడంతో పాటు, డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఉద్యోగాల కోసం వెయిట్ చేసే అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also read: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Temple : ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు.

శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు సమీక్ష చేసారు.

New Update
Vontimitta Temple

Vontimitta Temple

Vontimitta Temple : శ్రీరామనవమి వేడుకులకు దేశమంతా సిద్ధమైంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో భద్రాచలం, ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిమిట్ట దేవాలయాల్లో స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కాగా శ్రీరామనవమి వేడుకలకు రెండు రాష్ట్రాలు ఘనంగా ఏర్పాట్లుచేస్తున్నాయి. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతీ ఏటా ఈ ఆలయంలో వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు. ఒంటిమిట్ట ఏకశిలానగరంలో ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్ల పైన టీటీడీ అధికారులు సమీక్ష చేసారు. అధికారులకు పలు సూచనలు ఇవ్వటంతో పాటుగా చేపట్టా ల్సిన చర్యల పైన దిశా నిర్దేశం చేసారు. 

ఇది కూడా చదవండి: వేయించిన ఆహారాలతో క్యాన్సర్‌ ముప్పు

క్షేత్ర స్థాయిలో అధికారులు పటిష్ట ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 120 గ్యాలరీల లో ఉండే భక్తులతో పాటు, కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం 16 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భారీగా రానున్న భక్తులు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తిలకించేలా 15 ఎల్ ఈడీ స్క్రీన్ లు, ఆలయం , కల్యాణ వేదిక, తదితర ప్రాంతాల్లో విద్యుత్ కాంతులతో 38 దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సులువుగా గుర్తించేదెలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఇది కూడా చదవండి: లంగ్స్‌ బేషుగ్గా ఉండాలంటే తులసి ఆకులు నమలండి

విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో 100 సిసి కెమెరాలు, 3 డ్రోన్ లు, 3 కంట్రోల్ రూమ్ లు, దాదాపు 2400 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్స వాలకు దాదాపు 3 లక్షల తాగునీరు బాటిల్స్, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 13 మెడికల్ టీంలు, 8 అంబులెన్స్ లు, అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: పప్పు ధాన్యాలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తప్పవా?

 హెచ్ డి పీపీ - (18), దాస సాహిత్య ప్రాజెక్టు - (4,) అన్నమాచార్య ప్రాజెక్టు- (8) ఆధ్వర్యంలో మొత్తం 30 కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొదటిసారి కళాకృతులుతో సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు, కల్యాణ వేదిక, ఆలయం, పరిసర ప్రాంతాల్లో 12 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ తో పుష్పాలంకరణలు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ఒంటిమిట్టలో జరిగే ఈ కల్యాణోత్సవం తిలకించటానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.

Also read :  నీ అభిమానం సల్లగుండా.. పవన్ కోసం రక్తం చిందించిన అభిమాని.. ఏం చేశాడంటే?

Advertisment
Advertisment
Advertisment